TS MLC : తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గెలుపు

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్స్‌ MLC ఎన్నికలలో (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి శుక్రవారం విజయం సాధించారు.

21 రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఏవీఎన్ రెడ్డి 13,436 ఓట్లను సాధించి, మ్యాజిక్ ఫిగర్ 12,709 ఓట్లను అధిగమించి విజయం సాధించారు.

GHMC అదనపు కమిషనర్ (లీగల్) మరియు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఎన్నికల ప్రక్రియను వివరిస్తూ మొత్తం 25,868 ఓట్లు పోల్ అయ్యాయని, విజేతగా ప్రకటించడానికి అభ్యర్థి 12,709 ఓట్లను సాధించాల్సి ఉందని తెలిపారు.

అభ్యర్థులకు ఎవరో ఒకరు డెరైవ్డ్ కోటాలో చేరే వరకు అభ్యర్థుల తొలగింపు జరుగుతుందని ఆమె తెలిపారు. కౌంటింగ్ రోజు రాత్రి 8 గంటల వరకు పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై ఏవీఎన్ రెడ్డి 943 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

బీజేపీ బలపరిచిన అభ్యర్థికి 7,584 ఓట్లు రాగా, జి చెన్న కేశవ రెడ్డికి 6,641 ఓట్లు, పాపన్నగారి మాణిక్ రెడ్డికి 4,644 ఓట్లు వచ్చాయి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page