వాలంటీర్లకు మరో షాక్…రేషణ్ పంపిణీ లోనూ పాల్గొన కూడదని ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలవుతున్న కారణంగా వాలంటీర్ల విధులపై పరిమితులు విధిస్తూ ఎన్నికల కమిషన్ పలు ఉత్తర్వులను జారీ చేసింది.

ఇప్పటికే వాలంటీర్లను పెన్షన్ పంపిణీ లో వినియోగించ కూడదు అని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వాలంటీర్లు రేషన్ పంపిణీలోనూ పాల్గొన కూడదు అని ఉత్తర్వులు జారీ చేసింది.

జారీ చేసిన ఉత్తర్వులలో గల ముఖ్యమైన అంశాలు

  • ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ విభాగంలోనూ పాలుపంచుకోకూడదు.
  • వాలంటీర్స్ పేరిట ఉన్న బయోమెట్రిక్ Authentication ఎన్ఐసి నిలిపివేస్తుంది. వారి స్థానంలో వీఆర్వోలను మ్యాపింగ్ చేస్తారు.
  • కాబట్టి ఎక్కడన్నా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటే వీఆర్వో గారి Authentication తో పూర్తి చేయాలి.
  • అదేవిధంగా వార్డు గ్రామ సచివాలయాల శాఖ వారు వాలంటీర్లు అందరికీ కూడా తెలియజేయాలి. ఎండియూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను పంపిణీకి పిలవకూడదు.
  • వీఆర్వోల Authentication ప్రయత్నించే ముందు IRIS మరియు ఫ్యూజన్ ఫింగర్ ప్రయత్నించాలి.

ఈ నియమావళిని అందరూ తప్పక నేటి (ఏప్రిల్ 1) నుంచి జరగునున్న రేషన్ పంపిణీలో పాటించాలి. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



You cannot copy content of this page