పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రా పథకం – సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలుపొందొచ్చు

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగా పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ (KVP)ను అందిస్తోంది. దీంట్లో పొదుపు చేస్తే రెట్టింపు (EX. రూ.5లక్షలకు.. రూ.10లక్షలు పైగా) లాభాన్ని పొందొచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 115నెలలు కాగా రూ.1000తో పథకంలో చేరొచ్చు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్పై 7.5% వడ్డీ లభిస్తోంది. ఒకవేళ ప్రతి నెలా దాచుకోవాలంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్(6.5% వడ్డీ)లో చేరొచ్చు.

కిసాన్ వికాస్ పత్రా స్కీం అంటే ఏమిటి?

మొదట్లో రైతులు తమ డబ్బును పొదుపు చేసుకునేలా ప్రత్సాహించడం కోసం కిసాన్ వికాస్ పత్రా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ పధకంలో పెట్టుబడి పెట్టిన వారు ఒక నిర్దిష్ట సమయం తరువాత రెట్టింపు మొత్తాన్ని పొందుతారు. ఈ పథకానికి అందించే వడ్డీ రేటును ప్రభుత్వం 7.2 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. ఈ కొత్త వడ్డీ రేటు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పధకంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారు కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంత అయినా ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఈ పధకంలో పెట్టుబడి పెట్టిన వారు డబ్బు గతంలో 120 నెలలకు రెట్టింపు అయ్యేది. అయితే ఇటీవల ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచడంతో ఇప్పుడు 115 నెలలకే రెట్టింపు అవుతుంది.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు అర్హులు :

  • ఈ పథకంలో చేరాలనుకునే వారి భారతీయ పౌరులై ఉండాలి
  • ఈ పథకంలో చేరాలనుకునే వారి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  • పిల్లలు లేదా మానసిక వైకల్యం ఉన్న వారి తరుపున వారి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సహాయకులు ఈ పథకంలో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీస్ (హెచ్యూఎఫ్), ఎన్ఆర్ఐలు ఈ పథకంలో చేరడానికి అనర్హులు.
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page