వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

సంక్షేమవసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్ కుమార్ ముందడుగు వేశారు. విద్యార్థులకు’గోల్డెన్ అవర్ బీమా’ను రాష్ట్రంలో తొలిసారి జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు.ఐసీఐసీఐతో ఒప్పందం ఇప్పటివరకు విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఖర్చు సంక్షేమాధికారులపై పడుతోందని.. వారు వెనకాడుతున్నారు. దీంతో కలెక్టర్ ముంబయిలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం అధికారులతో చర్చించి ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50,000 వరకు బీమా కల్పించేలా ఒప్పించారు.ప్రీమియం డబ్బులు సైతం విద్యార్థి, ప్రభుత్వంపై భారం పడకుండా సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద వేదాంత సంస్థనుంచి నిధులు సమకూరేలా ఏర్పాటు చేశారు.

ఇందుకు ఏడాదికి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. కోనసీమ జిల్లాలో 94వసతి గృహాల్లో 8,384 మంది బాలలు చదువుకుంటున్నారు. వీరందరికీ ఈ బీమా అందుతుంది. జ్వరాలు, ఆటల్లో దెబ్బలు, కుక్క,పాము, తేలు కాట్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లు,టాన్సిల్స్, చర్మ సంబంధ సమస్యలు ఇలా 20 రకాల వ్యాధులను బీమాలో చేర్చారు.

చిన్నచిన్న అనారోగ్యాలు, దెబ్బలు తగిలినప్పుడు జాప్యం చేస్తే అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయి. గోల్డెన్ అవర్ లో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ బీమా పథకాన్ని అమలుచేయాలని భావించాం. దీనివల్ల డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంది. ఈ నెల15 తర్వాత అమలుచేయాలని నిర్ణయించారు

Click here to Share

You cannot copy content of this page