ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు
Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇంతకు ముందు Work From Home Survey గా ఉండగా, ఇప్పుడు ఆ సర్వే నే ప్రభుత్వం కౌశలం సర్వేగా మార్పు చేసింది.
Update: ఏపీ వర్క్ ఫ్రం హోం కౌశలం సర్వే ఇకపై మీరే స్వయంగా వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో నేరుగా కౌశలం సర్వే వివరాలు నమోదు చేసేందుకు కింది లింక్ పై క్లిక్ చేయండి. ap work from home survey apply online via below link
Note: ప్రస్తుతం లాప్టాప్/ డెస్క్ టాప్ లో మాత్రమే AP Work From Home Module లింక్ ఓపెన్ అవుతుంది… మొబైల్ లో చూపించడం లేదు
పూర్తి స్టెప్స్ కొరకు కింద ఇవ్వబడిన ప్రాసెస్ చదవగలరు.
ఆన్లైన్ లో కౌశలం సర్వే దరఖాస్తు ప్రక్రియ – Kaushalam Survey online registration process by self
Kousalam Survey Self Enrollment Link – సరైన అర్హత ఉండి భవిష్యత్తు లో ఇంటి నుంచి వర్క్ ఫ్రం హోం జాబ్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.
సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా కింది విధానం ద్వారా సర్వే పూర్తి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం కింది ప్రాసెస్ ఫాలో అవ్వండి.
AP Koushalam Survey Online Self Registration Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు Work From Home Jobs కల్పించేందుకు Koushalam Survey (కౌశలం సర్వే) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ (Village/Ward Sachivalayam) సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్లో (Online Apply) ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.
ఈ సర్వే ద్వారా మీ Education Qualification, Skills, Languages, Personal Details వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. తద్వారా భవిష్యత్లో Work From Home Opportunities పొందే అవకాశం ఉంటుంది.
ఎవరు Koushalam Survey (కౌశలం సర్వే) చేసుకోవాలి?
- ఇప్పటికే Sachivalayam Staff ద్వారా సర్వే చేసినవారు మళ్లీ చేయనవసరం లేదు.
- ఇప్పటివరకు సర్వే చేయని వారు లేదా Self Online Apply చేయదలచినవారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలి.
Koushalam Survey Required Details (అవసరమైన డాక్యుమెంట్స్)
- Aadhaar Card Number (ఆధార్ కార్డు నంబర్)
- Aadhaar Linked Mobile Number OTP (ఆధార్ లింక్ మొబైల్ OTP)
- Email ID (ఈ మెయిల్ ఐ డి)
- Education Course Details (ఏం చదివారు)
- Year of Passing (చదివిన సంవత్సరం)
- College/University Details (కాలేజ్ వివరాలు)
- Languages Known (తెలిసిన భాషలు)
- Marks/Percentage/Grades (మార్కుల వివరాలు)
- Certificate Upload (సర్టిఫికెట్ ఫోటో)
📌 Note:
10th & Intermediate విద్యార్థులకు Document Upload అవసరం లేదు.
Diploma, Graduation, Post-Graduation, Professional Courses చేసినవారు తప్పనిసరిగా Certificates Upload చేయాలి.
How to Register for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)

- Koushalam Survey Self Link ఓపెన్ చేయండి. తరువాత Work From Home Module పైన క్లిక్ చెయ్యండి
- Checkbox Select చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- వచ్చిన OTP Enter చేసి Login అవ్వండి.
- ఆధార్లో ఉన్న Personal Details సరిచూడండి. తప్పులుంటే ముందుగా సచివాలయం లో eKYC Update చేయాలి.
- Mobile Number & Email ID Verification పూర్తి చేయండి.
- మీకు తెలిసిన Languages ఎంచుకోండి.
- చదివిన Qualification (10th/Inter/Graduation/PG) సెలెక్ట్ చేయండి.
- Marks, Specialization, Year of Study, College Details ఎంటర్ చేయండి.
- అవసరమైతే Upload Original Certificates (CMM/Marks Memo) చేయండి.
- చివరగా Submit Application క్లిక్ చేయండి.
After Completion of Survey (సర్వే పూర్తి చేసిన తర్వాత) ప్రభుత్వం నుండి వచ్చే Work From Home Job Updates మీ Mobile & Emailకి వస్తాయి. అలాగే Sachivalayam Staff ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది. కాబట్టి Correct Mobile Number & Email ID తప్పనిసరిగా ఇవ్వండి.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా Koushalam Work From Home Survey ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఇది భవిష్యత్లో ప్రభుత్వం అందించే Work From Home Jobs & Employment Opportunities పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
FAQs – Andhra Pradesh Koushalam Survey 2025
1. Koushalam Survey ఎవరు చేయాలి?
ఇప్పటివరకు సర్వే చేయని నిరుద్యోగులు లేదా Self Online Apply చేయదలచినవారు చేయాలి.
2. Certificates Upload ఎవరికీ అవసరం?
Diploma, Graduation, Post-Graduation, Professional Courses చేసినవారు తప్పనిసరిగా Certificates Upload చేయాలి.
3. Work From Home Jobs ఎప్పుడు వస్తాయి?
Survey పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే అప్డేట్స్ Mobile & Email ద్వారా అందుతాయి.
- పై లింకులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.OTP ఎంటర్ చేశాక మీ సర్వే ఓపెన్ అవుతుంది.
- మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయాలి.
- తర్వాత మెయిల్ id ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయాలి.
- ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
గమనిక: 10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఈ సర్వేను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కూడా నిర్వహిస్తున్నారు. గతంలో Work From Home Survey లో వివరాలు ఇచ్చిన వారంతా కూడా ఇప్పుడు కొత్త కౌశలం సర్వేలో అప్డేట్ చేయించుకోవాలి. ఈ సర్వే గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగింది.

What is Kaushalam Survey కౌశలం సర్వే 2025 అంటే ఏమిటి?
- మొదట దీన్ని Work From Home Survey గా ప్రారంభించారు.
- తర్వాత దీనిని కౌశలం సర్వేగా పేరు మార్చి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ సన్నద్ధత వంటి వివరాలను సేకరిస్తున్నారు.
- సర్వేలోని డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్లో వచ్చే ప్రైవేట్ & గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల సమాచారం అందిస్తుంది.
- అర్హులైన వారికి ఇంటర్వ్యూలు & నోటిఫికేషన్లు పంపబడతాయి.
కౌశలం సర్వేకి ఎవరు అర్హులు? – Who is eligible for Kaushalam Survey [Work From Home survey Eligibility]
- ఆగస్టు 15, 2025 వరకు ITI, Diploma, Graduation, PG, Ph.D., PG Diploma ఉన్నవారిని మాత్రమే సర్వేలో తీసుకున్నారు.
- అర్హత ఉన్నవారు స్వయంగా ఆన్లైన్లో ఈ సర్వేను నింపవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయాలలో అయినా పూర్తి చేసుకోవచ్చు.
- 15 ఆగస్టు 2025 తరువాత విడుదలైన కొత్త GSWS Employees Appలో:
- 10వ తరగతి (SSC)
- ఇంటర్మీడియట్ (12th Class)
- 10వ తరగతి కంటే తక్కువ అర్హత కలిగిన వారు కూడా సర్వేలో నమోదు చేసుకోవచ్చు.
- ప్రస్తుతం చదువుతున్నవారు (Degree, B.Tech, PG మొదలైనవి) కూడా తమ వివరాలు అప్డేట్ చేయవచ్చు.
సర్వే ఎలా జరుగుతుంది? [Kaushalam survey online application or data entry process by sachivalayam staff]
- GSWS Employees App (New Version) డౌన్లోడ్ చేయాలి.
- App లో Logout & Login చేసి కొత్త ఆప్షన్లు యాక్టివ్ చేసుకోవాలి.
- సర్వేను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే చేస్తారు.
- బయోమెట్రిక్ / Face / OTP ద్వారా అభ్యర్థి ధృవీకరణ జరుగుతుంది.
- విద్యార్హత, స్పెషలైజేషన్, పాసైన సంవత్సరం, మార్కులు/GPA, కళాశాల/పాఠశాల పేరు, సర్టిఫికేట్ అప్లోడ్ వంటి వివరాలు నమోదు చేయాలి.
కొత్త యాప్లో ఉన్న ఫీచర్లు
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, SSC కంటే తక్కువ అర్హత కూడా యాడ్ చేసే ఆప్షన్.
- ప్రస్తుతం చదువుతున్న కోర్సులు కూడా నమోదు చేసే అవకాశం.
- OTP (మొబైల్/ఇమెయిల్) తప్పనిసరి కాదు.

సర్వేలో అడిగే ప్రశ్నలు
- తెలిసిన భాషలు
- విద్యార్హత & స్పెషలైజేషన్
- పాసైన సంవత్సరం & మార్కులు
- చదివిన స్కూల్/కలేజీ వివరాలు
- సర్టిఫికేట్ అప్లోడ్
- అదనపు అర్హతలు ఉంటే వాటి వివరాలు
కౌశలం సర్వే రిపోర్ట్
ప్రభుత్వం ఈ సర్వే రిపోర్టులను క్లస్టర్-వారీగా, మండల వారీగా, జిల్లా వారీగా అందిస్తోంది.
కౌశలం సర్వే 2025 రిపోర్ట్ లింక్ – Koushalam Survey Report Link
వేగంగా సర్వే పూర్తి చేసుకోవడానికి చిట్కాలు
- ముందుగానే పెండింగ్లో ఉన్న పేర్లను నోట్ చేసుకోవాలి.
- అభ్యర్థుల మొబైల్ నంబర్లు ముందుగానే సేకరించాలి.
- సర్టిఫికేట్లు WhatsApp లేదా గ్యాలరీలో సిద్ధంగా ఉంచుకోవాలి.
- App లో సెర్చ్ ఆప్షన్ వాడితే టైమ్ సేవ్ అవుతుంది.
- Mobile OTP ద్వారా వెరిఫికేషన్ చేస్తే ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే 2025 ద్వారా రాష్ట్రంలోని ప్రతి యువకుడి విద్య, నైపుణ్యాలను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేసింది.
ఈ సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి.
ఈ కౌశలం సర్వే సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. ఏపీ కౌశలం సర్వే 2025 అప్డేట్స్ & రిపోర్ట్స్ కోసం మా బ్లాగ్ను ఫాలో అవుతూ ఉండండి. లేదా కింద ఇవ్వబడిన వాట్సాప్ లో రెగ్యులర్ గా అప్డేట్స్ పొందవచ్చు.


Leave a Reply