ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు

Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇది ముందు Work From Home Survey గా ఉండగా, ఇప్పుడు ఆ సర్వే నే ప్రభుత్వం కౌశలం సర్వేగా మార్పు చేసింది.

ఈ సర్వేను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నారు. గతంలో Work From Home Survey లో వివరాలు ఇచ్చిన వారంతా కూడా ఇప్పుడు కొత్త కౌశలం సర్వేలో అప్‌డేట్ చేయించుకోవాలి.

What is Kaushalam Survey కౌశలం సర్వే 2025 అంటే ఏమిటి?

  • మొదట దీన్ని Work From Home Survey గా ప్రారంభించారు.
  • ఇప్పుడు దీన్ని కౌశలం సర్వేగా మార్చి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ సన్నద్ధత వంటి వివరాలు సేకరిస్తున్నారు.
  • సర్వేలోని డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్‌లో వచ్చే ప్రైవేట్ & గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల సమాచారం అందిస్తుంది.
  • అర్హులైన వారికి ఇంటర్వ్యూలు & నోటిఫికేషన్లు పంపబడతాయి.

ఎవరు అర్హులు? – Who is eligible for Kaushalam Survey

  • ఆగస్టు 15, 2025 వరకు ITI, Diploma, Graduation, PG, Ph.D., PG Diploma ఉన్నవారిని మాత్రమే సర్వేలో తీసుకున్నారు.
  • 15 ఆగస్టు 2025 తరువాత విడుదలైన కొత్త GSWS Employees Appలో:
    • 10వ తరగతి (SSC)
    • ఇంటర్మీడియట్ (12th Class)
    • 10వ తరగతి కంటే తక్కువ అర్హత కలిగిన వారు కూడా సర్వేలో నమోదు చేసుకోవచ్చు.
  • ప్రస్తుతం చదువుతున్నవారు (Degree, B.Tech, PG మొదలైనవి) కూడా తమ వివరాలు అప్‌డేట్ చేయవచ్చు.

సర్వే ఎలా జరుగుతుంది?

  1. GSWS Employees App (New Version) డౌన్‌లోడ్ చేయాలి.
  2. App లో Logout & Login చేసి కొత్త ఆప్షన్లు యాక్టివ్ చేసుకోవాలి.
  3. సర్వేను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే చేస్తారు.
  4. బయోమెట్రిక్ / Face / OTP ద్వారా అభ్యర్థి ధృవీకరణ జరుగుతుంది.
  5. విద్యార్హత, స్పెషలైజేషన్, పాసైన సంవత్సరం, మార్కులు/GPA, కళాశాల/పాఠశాల పేరు, సర్టిఫికేట్ అప్‌లోడ్ వంటి వివరాలు నమోదు చేయాలి.

కొత్త యాప్‌లో ఉన్న ఫీచర్లు

  • 10వ తరగతి, ఇంటర్మీడియట్, SSC కంటే తక్కువ అర్హత కూడా యాడ్ చేసే ఆప్షన్.
  • ప్రస్తుతం చదువుతున్న కోర్సులు కూడా నమోదు చేసే అవకాశం.
  • OTP (మొబైల్/ఇమెయిల్) తప్పనిసరి కాదు.

సర్వేలో అడిగే ప్రశ్నలు

  • తెలిసిన భాషలు
  • విద్యార్హత & స్పెషలైజేషన్
  • పాసైన సంవత్సరం & మార్కులు
  • చదివిన స్కూల్/కలేజీ వివరాలు
  • సర్టిఫికేట్ అప్‌లోడ్
  • అదనపు అర్హతలు ఉంటే వాటి వివరాలు

కౌశలం సర్వే రిపోర్ట్

ప్రభుత్వం ఈ సర్వే రిపోర్టులను క్లస్టర్-వారీగా, మండల వారీగా, జిల్లా వారీగా అందిస్తోంది.

కౌశలం సర్వే 2025 రిపోర్ట్ లింక్Koushalam Survey Report Link

వేగంగా సర్వే పూర్తి చేసుకోవడానికి చిట్కాలు

  • ముందుగానే పెండింగ్‌లో ఉన్న పేర్లను నోట్ చేసుకోవాలి.
  • అభ్యర్థుల మొబైల్ నంబర్లు ముందుగానే సేకరించాలి.
  • సర్టిఫికేట్లు WhatsApp లేదా గ్యాలరీలో సిద్ధంగా ఉంచుకోవాలి.
  • App లో సెర్చ్ ఆప్షన్ వాడితే టైమ్ సేవ్ అవుతుంది.
  • Mobile OTP ద్వారా వెరిఫికేషన్ చేస్తే ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే 2025 ద్వారా రాష్ట్రంలోని ప్రతి యువకుడి విద్య, నైపుణ్యాలను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేసింది.

ఈ సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి.

ఏపీ కౌశలం సర్వే 2025 అప్‌డేట్స్ & రిపోర్ట్స్ కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవుతూ ఉండండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page