గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.10 వేల వరకు!…వాలంటీర్లకు అవార్డులు

గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.10 వేల వరకు!…వాలంటీర్లకు అవార్డులు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ.. నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కరిస్తోంది. 2024 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 15,16 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ys Jaganmohan Reddy) చేతుల మీదుగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది..

ఫిబ్రవరి 15,16 తేదీల్లో వాలంటీర్లకు అవార్డులు

వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వారిని సత్కరిస్తుంది. తొలిసారి 2020–21లో.. రెండోసారి 2021 ఏప్రిల్‌ 14న.. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 7 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.2024 లో మరోసారి వాలంటీర్లను సత్కరించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాలంటీర్ల పనితీరుపై కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ప్రతినెలా మొదటి రోజునే వంద శాతం లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ.. క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు వంటి అంశాలలో పనితీరుపై అంచనా వేస్తారు. వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న అవార్డులకు ఎంపిక చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును అందుకునే వారికి రూ.30వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్‌తో సత్కరిస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున.. అదే నగర కార్పొరేషన్‌కు 10 మంది చొప్పున వాలంటీర్లకు సేవారత్న అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు పొందే వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్లను అందించనున్నారు.

ఇక మూడో అవార్డు విషయానికి వస్తే.. కనీసం ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా పనిచేసే మిగిలిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు అందజేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతిని అందిస్తారు.

You cannot copy content of this page