నేతన్న నేస్తం 2023-24 అమౌంట్ జమ కాలేదా? ఈ డీటైల్స్ మీకోసం

నేతన్న నేస్తం 2023-24 అమౌంట్ జమ కాలేదా? ఈ డీటైల్స్ మీకోసం

నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి జూలై 21 న విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది చేనేత కార్మికులకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను, తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా గత నెల బటన్ నొక్కి  ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది.

ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వ్యవధి లో చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి 1,20,000 సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

నేతన్న నేస్తం అమౌంట్ ఇంకా జమ కాలేదా?

ముఖ్యమంత్రి పేమెంట్ విడుదల చేసి రెండు వారాలు దాటుతున్న ఇంకా కొంతమంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ పడలేదని రిపోర్ట్ చేస్తున్నారు.

మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా కింది పోల్ ద్వారా తెలియజేయండి. ఇది మీ తోటి లబ్ధిదారుల అవగాహన కోసం పనికొస్తుంది.

[TS_Poll id=”21″]

కాబట్టి కింద ఇవ్వబడిన స్టేటస్ లింక్ లో అర్హత ఉన్నవారు మరో వారం రోజులు వెయిట్ చేయగలరు లేదా మీ సమీప సచివాలయంలో సంప్రదించండి. అదేవిధంగా మీ బ్యాంకు ఖాతా యాక్టివ్ లో ఉందో లేదో, మీ NPCI లింకింగ్ పూర్తి అయిందో లేదో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి.

నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ [Nethanna Nestham Payment Status 2023-24]

వైఎస్సార్ నేతన్న నేస్తం 2023 సంవత్సారానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ను కింది లింక్ మరియు ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు.

నేతన్న నేస్తం

Application స్టేటస్ లో ఎలిజిబుల్ , పేమెంట్ స్టేటస్ లో అమౌంట్ పడిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. అర్హత ఉన్నా ఇంకా అమౌంట్ పడని వారు మరికొంత సమయం వెయిట్ చేయండి లేదంటే మీ సమీప సచివాలయంలో సంప్రదించండి.

వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా ప్రతి ఏటా మగ్గాలపై జీవనాధారం పొందుతున్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page