Jaganannaku Chebudam : మే 9 నుంచి జగనన్నకు చెబుదాం.. అసలు ఏంటి ఈ పథకం? ప్రజలు జగనన్నకు ఏం చెప్పుకోవచ్చు?

Jaganannaku Chebudam : మే 9 నుంచి జగనన్నకు చెబుదాం.. అసలు ఏంటి ఈ పథకం? ప్రజలు జగనన్నకు ఏం చెప్పుకోవచ్చు?

ఏపీలో ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అనే ఒక కొత్త ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభిస్తుంది.

ఇందుకోసం 1 9 0 2 ఏదైతే ప్రస్తుతం హెల్ప్ లైన్ నెంబర్ ఉందో అదే హెల్ప్ లైన్ నెంబర్ ను ఈ కార్యక్రమానికి కూడా వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది

అసలు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎలా పనిచేస్తుంది? ఎం చెప్పుకోవచ్చు?

స్పందన అనే హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటికే ప్రజల సమస్యలను 1902 నెంబర్ ద్వారా వింటున్నటువంటి ప్రభుత్వం ఇకపైన ప్రతి మండలం డివిజన్ స్థాయిలో వీటికోసం టీమ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది.

ప్రజలు ప్రభుత్వం కి సంబంధించి లేదా సంక్షమ పథకాలు లేదా ప్రభుత్వ అధికారుల పనితీరు పై ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే 1902 నంబర్ కు కాల్ చేసి పిర్యాదు చేసుకోవచ్చు. ఇక పై ఈ వ్యవస్థ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణ లో ఉంటుంది.

Jaganannaku Chebudam Helpline Number : 1902

ఇటువంటి టీమ్స్ కి ఆడిట్ చేయడం కోసం లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు వివిధ స్పందన లాగిన్లలో పరిష్కరించినటువంటి సమస్యల గురించి CMO అనగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిటిషనర్లకు ఫోన్ పాల్స్ చేసి వారి ఫీడ్బ్యాక్ ను తీసుకోవడం జరుగుతుంది.

ఫీడ్ బ్యాక్ తీసుకునేటప్పుడు ఒకవేళ పిటిషనర్లు లేదా కంప్లైంట్ చేసిన వారు సంతృప్తి చెందకపోతే వారి యొక్క వివరాలను ఆయా మండలాల టీం కి పంపించడం జరుగుతుంది. వారు వీటిని పూర్తిగా చదివి ఒకవేళ సరైన రీతుల వాటిని పరిష్కరించనట్లయితే ఆడిట్ చేసి ఈ సమస్యలను తిరిగి ఓపెన్ చేయడం జరుగుతుంది.

అదేవిధంగా ఈ సమస్యను పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా కలెక్టర్ వారి రివ్యూ మీటింగ్ ప్రతివారం జరగనున్నాయి.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు

jaganannaku chebudam

►సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి
►ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలి
►గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది
►హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయి
►వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి
►గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం

►ఇండివిడ్యువల్‌, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్‌
►రిజ్టసర్‌ అయిన గ్రీవెన్సెస్‌ ఫాలో చేయడం
►ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ
►ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు

►ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారు
►వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు:
►ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది

►ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందుతాయి
►అంతేకాక ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుంది
►గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు
►ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు

►జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి
►సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి

►ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు
►క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు
►ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు
►కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు
►సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు
►ఎక్కడైనా స పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు

►ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు

►పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు

►చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు

►ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది

►ప్రజలకు నాణ్యమైన సేవలను అదించాలన్నదే ఈ పథకం ఉద్దేశం అని ప్రభుత్వం తెలిపింది.

►ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది

►అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు

►వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తారు.

►దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్‌ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది

►అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా వీరు దృష్టిపెడతారు.

►ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోయే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page