ఇడ్లీలను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసా? వివిధ రకాల ఇడ్లీలు మరియు వాటి తయారీ విధానం చూసేయండి

ఇడ్లీ, ప్రపంచంలో ఈ పేరు విన్నవారికి ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది మన దక్షిణ భారతదేశం. సౌత్ ఇండియా లో ఇడ్లీ ని టిఫిన్ గా తినని ఫ్యామిలీ దాదాపు ఉండకపోవచ్చు . ఇది తేలికగా , మెత్తగా ఆవిరిపై తయారు చేయబడిన అల్పాహారం కావడంతో పిల్లలు మొదలు ముసలి వారి వరకు తొందరగా జీర్ణమవుతుంది. ఇడ్లీని వివిధ రకాల చట్నీలతో లేదా సాంబార్ తో తింటాం. అయితే ఇడ్లీనే ఎన్నో రకాలు గా చేసుకుని తినవచ్చు. మరి ఎన్ని రకాలు ఇడ్లీ లు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేసుకొని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణ ఇడ్లీ తయారీ విధానం [బియ్యం తో]

కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపప్పు, రుచికి సరిపడా ఉప్పు, అవసరమైనంత నీరు.

తయారీ విధానం: బియ్యం మరియు పట్టు తీసిన మినపప్పు ను విడివిడిగా 4-5 గంటలు నానబెట్టాలి. మినపప్పును అవసరమైన నీటిని పోస్తూ మెత్తటి పిండిగా రుబ్బుకోవాలి. బియ్యాన్ని కాస్త ముతక పిండిలా రుబ్బుకోవాలి. తర్వాత రుబ్బుకున్న మినపప్పు మరియు బియ్యం పిండిని కలిపి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిని రాత్రిపూట లేదా కనీసం 8-10 గంటలు పులియబెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వండుకునే ముందు బాగా కలుపుకోవాలి.

వండుకునే విధానం: ఇడ్లీ పాత్రలో అచ్చులను నూనెతో కొంచెం తడి చేసి, వాటి పైన ఇడ్లీ సైజ్ కి తగ్గట్లు పిండితో నింపండి. ఇడ్లీలను 10-12 నిమిషాలు లేదా ఉడికినంత వరకు ఆవిరి మీద ఉడికించాలి.

అంతే, వేడి వేడి ఇడ్లీ రెడీ.. శనగ పప్పు, లేదా వేరుశనగ పప్పు చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

రవ్వ ఇడ్లీ తయారీ విధానం: [ఇడ్లీ రవ్వ తో]

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1/2 కప్పు మినపప్పు, రుచికి సరిపడా ఉప్పు, అవసరమైనంత నీరు.

తయారీ విధానం: మినపప్పు ను 4-5 గంటలు నానబెట్టాలి. మినపప్పును అవసరమైన నీటిని పోస్తూ మెత్తటి పిండిగా రుబ్బుకోవాలి. మరో వైపు ఇడ్లీ రవ్వ నీటిలో కడిగి, నీరు మొత్తం తీసేయాలి. అందులో ఒక స్పూన్ పెరుగు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ, మినపప్పు పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. కనీసం 8-10 గంటలు పులియబెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వండుకునే ముందు బాగా కలుపుకోవాలి.

వండుకునే విధానం: ఇడ్లీ పాత్ర అడుగున నీరు సరిపడా పోయాలి. ఇడ్లీ పాత్రలో అచ్చులను నూనెతో కొంచెం తడి చేసి, వాటి పైన ఇడ్లీ సైజ్ కి తగ్గట్లు పిండితో నింపండి. ఇడ్లీలను 10-12 నిమిషాలు లేదా ఉడికినంత వరకు ఆవిరి మీద ఉడికించాలి.

రాగి ఇడ్లీ తయారీ విధానం

కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు మినపప్పు, 1/2 స్పూన్ మెంతి గింజలు, రుచికి సరిపడా ఉప్పు, అవసరమైనంత నీరు.

మనపప్పు మరియు మెంతి గింజలను నీటిలో కడిగి 4-5 గంటలు నీటిలో నాన బెట్టాలి. రాగి పిండిని కడిగి నీటిలో 2 గంటలు నానబెట్టాలి. మినపప్పు మరియు మెంతి గింజలను వెట్ గ్రైండర్ లేదా మిక్సర్ ఉపయోగించి మృదువైన, మెత్తటి పిండిలా గ్రైండ్ చేయండి. అవసరమైన విధంగా నీరు జోడించండి. రాగి పిండిని మినపప్పు పిండితో కలపి రుచికి సరిపడా ఉప్పు వేయండి. బాగా మృదువుగా ఈ మిశ్రమాన్ని కలపాలి. అయితే సాధారణ ఇడ్లీ పిండి మాదిరిగానే పిండి కొద్దిగా మందంగా ఉండాలి. పిండిని ఒక మూతతో కప్పి, రాత్రిపూట లేదా 8-10 గంటలు పులియ బెట్టాలి. వండుకునే ముందు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి పైకి లేచి కొద్దిగా మెత్తగా ఉండాలి.

వండుకునే విధానం: ఇడ్లీ పాత్ర అడుగున నీరు సరిపడా పోయాలి. ఇడ్లీ పాత్రలో అచ్చులను నూనెతో కొంచెం తడి చేసి, వాటి పైన ఇడ్లీ సైజ్ కి తగ్గట్లు పిండితో నింపండి. ఇడ్లీలను 10-12 నిమిషాలు లేదా ఉడికినంత వరకు ఆవిరి మీద ఉడికించాలి. కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే చాలా బాగుంటుంది.

ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం

కావలసిన పదార్థాలు: 1 కప్పు వోట్స్, 1/2 కప్పు మిన పప్పు, 1/2 కప్పు పెరుగు, 1/2 టీస్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర గింజలు, 1/2 స్పూన్ మినపప్పు గింజలు, 1/2 టీస్పూన్ శనగ పప్పు, 1/2 tsp అల్లం తురుము, చిటికెడు ఇంగువ, రుచికి సిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, అవసరమైనంత నీరు

తయారీ విధానం: ఓట్స్‌ను మీడియం మంట మీద 3-4 నిమిషాలు సువాసన వచ్చే వరకు పొడిగా వేయించండి. వేయించిన ఓట్స్ ను మెత్తగా రుబ్బుకోవాలి. మినప్పప్పు ను 4-5 గంటలు నానబెట్టండి. మిన పప్పును అవసరమైన నీటిని పోసి మెత్తటి పిండిగా రుబ్బుకోవాలి. వోట్ పౌడర్, మినపప్పు పిండి, పెరుగు మరియు ఉప్పు అన్ని ఒక మిశ్రమంగా కలపండి. కొంచెం మందపాటి పిండి గా ఉండేలా అవసరమైన విధంగా నీరు కలపండి.

బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు గింజలు, శెనగపప్పు, అల్లం మరియు ఇంగువ వేయాలి. పప్పు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పిండిలో ఇవన్నీ వేసి బాగా కలపాలి. పిండిని రాత్రిపూట లేదా కనీసం 8-10 గంటలు వెచ్చని ప్రదేశంలో పులియబెట్టుకోవాలి. వండుకునే ముందు పిండిని బాగా కలుపుకోవాలి.

వండుకునే విధానం: ఇడ్లీ పాత్ర అడుగున నీరు సరిపడా పోయాలి. ఇడ్లీ పాత్రలో అచ్చులను నూనెతో కొంచెం తడి చేసి, వాటి పైన ఇడ్లీ సైజ్ కి తగ్గట్లు పిండితో నింపండి. ఇడ్లీలను 10-12 నిమిషాలు లేదా ఉడికినంత వరకు ఆవిరి మీద ఉడికించాలి.

మిగిలిపోయిన ఇడ్లీలతో మసాలా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం

కావలసిన పదార్థాలు: 4-5 మిగిలిపోయిన ఇడ్లీలు, 1 ఉల్లిపాయ, తరిగిన 1 టమోటా, తరిగిన 1 పచ్చి మిరపకాయ, తరిగిన 1/2 అంగుళాల తురిమిన అల్లం, 1/4 టీస్పూన్ ఆవాలు, 1/4 tsp జీలకర్ర గింజలు, 1/4 టీస్పూన్ పసుపు పొడి, 1/4 టీస్పూన్ ఎర్ర మిరప పొడి, 1/4 tsp కొత్తిమీర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, గార్నిష్ కోసం కొత్తిమీర ఆకులు,

తయారీ విధానం: మిగిలిన ఇడ్లీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి కొద్దిగా చిటపట వేగటం ప్రారంభించినప్పుడు, తురిమిన అల్లం మరియు తరిగిన పచ్చిమిర్చి వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా మారే వరకు వేయించాలి. తరిగిన టొమాటో వేసి మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. పసుపు పొడి, ఎర్ర మిరప పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు జోడించండి.ఇక ఇడ్లీ ముక్కలు వేసి అన్నీ చక్కగా కలపాలి. ఇడ్లీలకు మసాలా పూత పట్టే విధంగా 2-3 నిమిషాలు ఉంచండి. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే, రుచికరమైన మసాలా ఇడ్లీ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది!

ఇవే కాకుండా కొంతమంది ఇడ్లీలలో వెజిటేబుల్స్ వేసుకుంటారు, కొంతమంది ఇడ్లీని ఉప్మా రూపంలో కూడా చేసుకొని తింటారు. ఈ విధంగా ఇడ్లీ ని ఎన్నో రకాలుగా మనం రుచిగా తయారు చేసుకొని తినవచ్చు. ఇడ్లీ ఇంత పాపులర్ కాబట్టేనేమో మార్చ్ 30 తేదీని మనం ప్రపంచ ఇడ్లీ దినోత్సవం (world idli day) గా కూడా జరుపుకుంటాం.

ఇవి ఫ్రెండ్స్ ఇడ్లీలకు సంబంధించి వివిధ రకాలు.. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ చేసి తెలుపగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!