నేటి నుంచి విజయవాడ –  చెన్నై వందే భారత్ ట్రైన్.. పూర్తి వివరాలు

ఏపీలో మరో వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ రైలును ఆదివారం (24 సెప్టెంబర్ 2023) ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి తమిళనాడు రాజధానితోపాటు తిరుపతి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. అదే మార్గంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తుంది.

మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ప్రయాణం..

  • విజయవాడలో సాయంత్రం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది.
  • చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుకుంటుంది.
  • మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఉండేలా ఈ రైలు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ వందేభారత్ రైలు సర్వీసును నిర్వహిస్తారు.
  • ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోల్తో పాటు మొత్తం 8 కోచ్ లు, 530 సీట్లతో ఈ రైలును రూపొందించారు.

రైలు ప్రయాణించే టైమింగ్స్ ఇలా…

  • చెన్నై – విజయవాడ ట్రైన్ టైమింగ్స్
స్టేషన్ చేరుకునే సమయం
చెన్నై5.30 AM
రేణిగుంట జంక్షన్ 7.05 AM 
నెల్లూరు8.39 AM 
ఒంగోలు10.09 AM 
తెనాలి జంక్షన్కు11.21 AM 
విజయవాడ12.10 PM
  • విజయవాడ – చెన్నై ట్రైన్ టైమింగ్స్
స్టేషన్ చేరుకునే సమయం
విజయవాడ3.20 PM
తెనాలి జంక్షన్3.49 PM
ఒంగోలు5.03 PM.
నెల్లూరు6.19 PM.
రేణిగుంట జంక్షన్ 8.05 PM
చెన్నై సెంట్ర10 PM

టికెట్ ధరలు

1. విజయవాడ నుంచి చెన్నై సెంట్రలు కేటరింగ్ చార్జీలతో..

  • ఏసీ చైర్ కార్: రూ. 1,420
  • ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ రూ.2,630

కేటరింగ్ చార్జీ లేకుండా…

  • ఏసీ చైర్ కార్: రూ. 1,135
  • ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2,280

2. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు కేటరింగ్ చార్జీలతో..

  • ఏసీ చైర్ కార్: రూ. 1,320
  • ఎగ్జిక్యూటివ్ క్లాస్ .2,540

కేటరింగ్ చార్జీ లేకుండా..

  • ఏసీ చైర్ కార్: రూ. 1,135
  • ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ : రూ.2,280

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!