రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా పథకాల ద్వారా పెళ్లి చేసుకునే వారికి నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే… ఇంకా తేడాది అక్టోబర్ నుంచి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పెళ్లయిన తర్వాత 60 రోజులు వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఈ గడువును మరింత తగ్గించింది.
ఇకపై ఎన్ని రోజుల్లో అప్లై చేయాలంటే
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేటటువంటి జంటలు తమ పెళ్లయిన 30 రోజుల్లోపు సచివాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల నుంచి గడువును నెల రోజులకు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .
వీటిని అమలు చేయాల్సిందిగా గ్రామ వార్డ్ సచివాలయ శాఖ కు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్వుల వివరాలను మీరు దిగువున చూడవచ్చు

వైయస్ఆర్ కళ్యాణమస్తు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింకు చూడండి
వైయస్సార్ షాది తోఫా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి
One response to “వైఎస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా అప్లై చేసుకునే గడువును తగ్గించిన ప్రభుత్వం.. పెళ్ళైన ఎన్ని రోజుల్లో అప్లై చేయాలంటే”
Maku marriage ayyi 40days avuuthundi pelli kuthuru adhar update kaledhu so apply cheyyadaniki kudaraledu memu apply chesukovaccha.