ఉచిత ఇసుక పాలసీపై చంద్రబాబు కీలక నిర్ణయం

ఉచిత ఇసుక పాలసీపై చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.

ఇసుకపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించి కింది విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • • ఇకపై ప్రతి రోజూ ఇసుక సరఫరా జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
  • • ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు.
  • • ఇసుక సరఫరాలో జరిగే అవకతవకలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ, ఈ మెయిల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
  • • టోల్ ఫ్రీ నెంబర్ : 1800-599-4599, ఈ మెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com కి కాల్ చేసి లేదా మెయిల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
  • • ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం.
  • • ఇసుక రవాణ ఛార్జీలను నోటిఫై చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.
  • • ఉచిత ఇసుక సరఫరాపై ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు సమర్పించాలని ఆదేశం.
  • • ఇసుక అక్రమ తవ్వకాలు మరియు అక్రమ రవాణను అరికట్టే బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • • ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల పేర్కొన్న విధంగా సచివాలయాలలో కూడా ఇసుక బుకింగ్ తీసుకురానున్నట్లు సమాచారం.
  • • ఎప్పటికప్పుడు స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలని సీఎం ఆదేశాలు.
  • • బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా కట్టడి చేయాలని ఆదేశాలు.
  • • బుకింగ్ రసీదుల తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి.
  • • ఇసుక రవాణ ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • • నోటిఫై చేసిన ఇసుకను రవాణా ధరల కంటే..ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

ఉచిత ఇసుక పాలసీ సంబంధించి మరిన్ని వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

You cannot copy content of this page