Aadhaar Camps: ఫిబ్రవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

Aadhaar Camps: ఫిబ్రవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఫిబ్రవరి 20, 21, 22 & 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు

సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.

UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.53 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్‌డేట్‌లను చేసిన వారికి , మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్‌వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVWV&VSWS డిపార్ట్‌మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్‌లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS) రూ.500 అందజేస్తుంది.

Also Read

ఆన్లైన్ లో అయితే పూర్తి ఉచితంగా మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. కింది ప్రాసెస్ చూడండి

సచివాలయంలో అందించే ఆధార్ సేవలు :

సేవలుService Charge
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్50/-
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్50/-
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్100/-
పేరు మార్పు ( Proof తప్పనిసరి )50/-
DOB మార్పు ( Proof తప్పనిసరి )50/-
జెండర్ మార్పు50/-
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)50/-
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )50/-
కొత్తగా ఆధార్ నమోదుFree
Mandatory Biometric UpdateFree
3+ Anyone Service100

You cannot copy content of this page