ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారంలో సర్టిఫికెట్, మెడల్, రూ.20,000 నగదు అందజేయనున్నారు.
ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులు
రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘Shining Stars’ పేరుతో ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందించనుంది.
అవార్డుల ప్రధానోత్సవం
ఈనెల 9వ తేదీన జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో అర్హులైన వారికి అవార్డులు అందించనున్నారు
అవార్డులో లభించేవి
- ₹20,000 నగదు బహుమతి
- మెడల్
- ప్రశంసాపత్రం
అవార్డుల ఎంపికకు అర్హతలు:
పదవ తరగతి విద్యార్థులు:
500 పైగా మార్కులు సాధించిన వారు ప్రతి మండలానికి 6 మంది ఎంపిక
• OC – 2 • BC – 2 • SC – 1 • ST – 1 (Boy or Girl)
ఇంటర్మీడియట్ విద్యార్థులు:
830 పైగా మార్కులు సాధించిన వారు ప్రతి జిల్లాకు 36 మంది ఎంపిక చెస్తారు..
Leave a Reply