ఆరోజే జగనన్న తోడు అమౌంట్ విడుదల, ఉత్తర్వులు జారీ

ఆరోజే జగనన్న తోడు అమౌంట్ విడుదల, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించే జగనన్న తోడు పథకం ఈ ఏడాది అమౌంట్ ను జూలై 18 న విడుదల చేయనున్న సీఎం.

ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణం లభిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది తోడు నిధులు విడుదల కార్యక్రమానికి తేదీని ఖరారు చేసింది అలాగే నిధుల మంజూరుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ద్వారా virtual గా ప్రారంభించడం జరుగుతుంది.

ఈ పథకం ద్వారా ఈ ఏడాది 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ మరియు వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు.

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ మరియు వెరిఫికేషన్ పూర్తయింది. అర్హులైన లబ్ధిదారుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగింది.

జగనన్న తోడు పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్డేట్స్ కొరకు కింది లింకును క్లిక్ చేయండి.

Click here to Share

One response to “ఆరోజే జగనన్న తోడు అమౌంట్ విడుదల, ఉత్తర్వులు జారీ”

  1. G sivanjali Avatar
    G sivanjali

    జగనన్న తోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page