ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు: ఉత్తర్వులు జారీ

ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు: ఉత్తర్వులు జారీ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు.

ఈ నెల 1 నుంచి 30వరకు ఈ విధానం అమలులో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకునేవారు అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా తిరిగి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

గత వైకాపా ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టి ఎన్నికల ముందు నిలిపివేశారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కింద ఇవ్వబడింది

Click here to Share

You cannot copy content of this page