ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్‌లు

ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్‌లు

పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసింది. కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ ఏర్పాటు చేశారు. పోలవరం విషయంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు. పోలవరానికి కేంద్రం పెండింగ్‌ నిధులు ఇవ్వాలి. కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు.

పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్ళీ గట్టెక్కింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని నిపుణులు తేల్చారు. రూ.992 కోట్లతో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తాం. 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం అని చంద్రబాబు తెలిపారు.

ఏపీలో మూడు కారిడార్‌లు..

దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్‌లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్‌లు ఉన్నాయి. వీటిపై మొత్తం రూ.28వేల కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్‌లు వస్తున్నాయి. కృష్ణపట్నానికి కూడా అనుమతిచ్చారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్‌ కూడా వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు’’ అని చంద్రబాబు అన్నారు.

You cannot copy content of this page