రైతులకు గుడ్ న్యూస్, రెండో విడత ధాన్యం అమౌంట్ విడుదల

రైతులకు గుడ్ న్యూస్, రెండో విడత ధాన్యం అమౌంట్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగులు చేసి బకాయి పడిన అమౌంట్ ను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసింది.

మొత్తం 84,724 మంది రైతులకు గత ప్రభుత్వం 1674.47 కోట్లను చెల్లించ కుండా పెండింగ్ పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే తొలి విడత గా కూటమి ప్రభుత్వం 1000 కోట్ల బకాయిలను చెల్లించగా, తాజాగా మరో 674.47 కోట్లను సోమవారం ప్రభుత్వం రెండో విడత కింద విడుదల చేసింది.

రెండో విడతలో భాగంగా 35,374 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీంతో పూర్తి బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేసింది.

అమౌంట్ జమ అయిందో లేదో తెలుసుకునేందుకు రైతులు తమ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోవచ్చు.


You cannot copy content of this page