గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులను అప్పగించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులను అప్పగించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు. అర్హులైన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించొచ్చని సూచించారు.

ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకూ కీలక సూచనలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి విధులను మాత్రమే అప్పగించాలని ఈసీ ఆదేశించింది.

ప్రతీ పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని వెల్లడించింది. బీఎల్ఓలుగా వ్యవహరించిన గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ తేల్చి చెప్పింది.

బీఎల్ఓలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. గ్రామవార్డు వలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టం చేస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్ధులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వలంటీర్లను అనుమతించవద్దని ఈసీఐ తేల్చి చెప్పింది.

You cannot copy content of this page