జగనన్న తోడు పథకం అమౌంట్.. విడుదల చేసిన సీఎం జగన్…స్టేటస్ ఇలా చెక్ చేయండి

జగనన్న తోడు పథకం అమౌంట్.. విడుదల చేసిన సీఎం జగన్…స్టేటస్ ఇలా చెక్ చేయండి

రాష్ట్రంలో ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ.. వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది. చిరు వ్యాపారుల ఉపాధికి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ. 10,000 అందిస్తోంది.

3,95,000 చిరు వ్యాపారులకు రూ. 417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు.. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి.. మొత్తం రూ. 431.58 కోట్లను ఇవాళ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసారు.

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వారిని నిలబెడుతూ.. ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తోంది ప్రభుత్వం. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నార. ఇవాళ అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ. 13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు.

ఇవాళ అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన వారి తరఫున వడ్డీని ఏపీ ప్రభుత్వం భరిస్తోంది.. లబ్దిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తిరిగి చెల్లిస్తున్నారు.

ఈ పథకానికి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు అర్హులు. తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు.. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు.. చేనేత, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరువ్యాపారులను ఆదుకుంటున్నారు.

జగనన్న తోడు” ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) ప్రభుత్వం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా “పీఎం స్వనిధి” ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 16,73,576 మందికి “జగనన్న తోడు” ద్వారా వడ్డీ లేని రుణాలు.. దేశవ్యాప్తంగా “పిఎం స్వనిధి” క్రింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు అయితే ఏపీలో “జగనన్న తోడు” ద్వారా అందించిన రుణాలే అక్షరాల రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా “పీఎం స్వనిధి” క్రింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ. 138.49 కోట్లుగా ఉంటే “జగనన్న తోడు” ద్వారా రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు.

జగనన్న తోడు పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి

జగనన్న తోడు 2024 స్టేటస్ ను కింది విధంగా చెక్ చేయండి.. మీ బ్యాంక్ ఖాతాలో ఋణం అమౌంట్ జమ అయ్యిందా లేదా పేమెంట్ స్టేటస్ కింది విధంగా చూడండి

తోడు రుణాలకు సంబంధించి మీరు అప్లై చేసిన వివరాలు , మీ అప్లికేషన్ స్టేటస్ , ఎంత మొత్తం ఋణం మీకు మంజూరు అయింది , లబ్ధిదారుల వివరాలు , ఋణం ఎప్పుడు జమ అయింది అన్ని డీ టెయిల్స్ మీరు కింది విధంగా చెక్ చేయవచ్చు

Step 1 : ముందుగా కింది లింక్ పై క్లిక్ చేయండి

Step 2 : మీ జిల్లాను ఎంచుకోండి

Step 3 : మీ మండలాన్ని ఎంచుకోండి

Step 4 : మీ సచివాలయాన్ని ఎంచుకోండి

Step 5 : మీ సచివాలయం పైన క్లిక్ చేసిన తర్వాత సచివాలయం పరిథిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి. అందులో మీ వివరాలను మీరు చూడవచ్చు.

ఇక ఖాతాలో ఋణం అమౌంట్ జమ అయ్యిందా లేదా స్టేటస్ పై విధానం లో చెక్ చేయవచ్చు అయితే వడ్డీ అమౌంట్ జమ అయ్యిందా లేదా అనేది మాత్రం మీరు బ్యాంక్ కి వెళ్లి , లేదా ATM ద్వారా లేదా missed call ఇచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చూడవచ్చు

You cannot copy content of this page