నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల

నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల
  • 1,46,324 మంది అన్నదాతలకు రూ.109.74 కోట్ల పెట్టుబడి సాయం
  • క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం జగన్

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అదించనుంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయనున్నారు.

నేడు (సెప్టెంబర్ 1) ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు.

ఏటా మూడు దఫాల్లో..

పెట్టుబడి రాష్ట్రంలో భూ యజమానులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.

మే నెలలో రూ.7,500, అక్టోబర్ రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన
కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందచేస్తోంది.

ఐదో ఏడాది తొలి విడతగా తాజాగా అందచేస్తున్న సాయంతో ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321. మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎస్ఆర్ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కానుంది. ఇక మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించినట్లవుతోంది.

Rythu Bharosa కి సంబంధించి స్టేటస్ మరియు అర్హుల జాబితాను కింది లింక్ ద్వారా చెక్ చేయండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page