Dalit Bandhu 2.0 :  ప్రారంభమైన దళిత బంధు 2.0 అప్లికేషన్స్

Dalit Bandhu 2.0 :  ప్రారంభమైన దళిత బంధు 2.0 అప్లికేషన్స్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి దళిత బంధు పథకానికి సంబంధించి రెండో దశ అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి.

వారంలోగా దళిత బంధు 2.0 అప్లికేషన్స్

దళిత బంధు 2.0 పథకానికి సంబంధించి దరఖాస్తులను వారం రోజులలోగా సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాసరావు మరియు మహమ్మద్ అలీతో జరిగిన సమావేశంలో అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఈసారి మరింత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.

దళిత బంధు 2.0 లో 1.30 లక్షల మందికి లబ్ది

దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే 2023-24 బడ్జెట్లో రూ.17,700 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. మొదటి విడత లో ఒక్కో నియోజకవర్గం లో 100 మందిని చొప్పున ఎంపిక చేసి లబ్ధి చేకూర్చినట్లు మంత్రి తలసాని శ్రీనివాసరావు వెల్లడించారు.

రెండో విడతలో భాగంగా హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 కుటుంబాల చొప్పున మొత్తంగా 1,29,800 కుటుంబాలకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయనుంది. అంతే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలు కలిపి మొత్తంగా 1.30 కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందుచేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Second phase Dalit Bandhu begins in Telangana

ఆన్లైన్లో అప్లికేషన్స్.. పూర్తి ప్రాసెస్ ఇలా

దళిత బంధు మొదటి విడత పథకానికి సంబంధించి ఆన్లైన్ మరియు యాప్ లో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను పొందుపరచడం అదేవిధంగా వారు ఏ యూనిట్లను కొనుగోలు చేశారు వారి జీవిత ప్రమాణాలు ఇప్పుడు ఎలా మారాయి అనే విషయాలపై ఇప్పటికే వారి యొక్క వివరాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదే విధంగా రెండో విడతలో కూడా ఎంతో పారిదర్శకంగా ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు మరియు వారి కొనుగోలు చేసే యూనిట్ల వివరాలను కూడా పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.

రెండో విడత దళిత బంధు పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైన నేపథ్యంలో, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తారని, విధంగా నిర్వహించిన సర్వే ఆధారంగా అర్హులైన వారి జాబితాలను కలెక్టర్లకు అందించడం జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ వెల్లడించింది.

కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన వివరాలను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితాను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి నిర్దేశించిన తేదీలలో రెండో విడత దళిత బంధు కింద పది లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

10 లక్షలు జమ చేసిన తర్వాత వారు ఏ యూనిట్లను కొనుగోలు చేశారు వారి జీవిత ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనే అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

వచ్చే 8 ఏళ్లలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు

దశల వారీగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వచ్చే ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందేలా చూస్తామని ప్రకటించింది.

దళిత బంధు పథకం అర్హతలు ఇవే

➤ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి.
➤ సరైన కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
➤ తెలంగాణ రాష్ట్రం వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
➤ తెలంగాణ రేషన్ కార్డు పొంది ఉండాలి.
➤ ఆదార్ కార్డు కలిగి ఉండాలి

ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ డబ్బును సొంత వ్యాపారానికి ఖర్చు పెట్టుకోవచ్చంటూ ఇది వరకే 47 రకాల వ్యాపారాలను కూడా సూచించింది. డెయిరీ ఫామ్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, బార్లు, వైన్ షాపులు కూడా నిర్వహించవచ్చు. అవి కాకుండా వేరే వృత్తి ఏదైనా ఎంచుకోవాలని అనుకున్నా దళిత కుటుంబాలు తమ ఆలోచనల ప్రకారం నడుచుకోవచ్చు. కలసి పెట్టుబడులు పెట్టుకొని పెద్ద వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకున్నా వాటిని స్వాగతిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికే మొదటి విడతలో దళిత బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి వారి జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి అదే విధంగా వారు కొనుగోలు చేసినటువంటి యూనిట్ల వివరాలు అన్నీ కూడా వీడియో రూపంలో మరియు ఫోటో రూపంలో ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page