Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్ కొత్త వారికి కూడా “రైతుబంధు” దరఖాస్తులు ప్రారంభం

Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్ కొత్త వారికి కూడా “రైతుబంధు” దరఖాస్తులు ప్రారంభం

ఈనెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయి, పాస్‌బుక్‌ పొందిన వారు కొత్తగా రైతుబంధుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లో రైతుల నుంచి AEOలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. భూమి ఉన్నప్పటికీ సాయం పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గత వారం పోయిన సంవత్సరం కి సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చింది.

ఈనెల 24న CM KCR 1.50 లక్షల మందికి పోడు భూములు పంపిణీ చేస్తుండగా, వారికి కూడా రూ.5వేల సాయం అందనుంది. ఈ నెల 26 నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

జూన్ 26 నుంచి రైతు బంధు

రైతుబంధు ఖరీఫ్ సీజన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26 నుంచి జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి ఎకరాకు 5000 చొప్పున రైతుల ఖాతాలో నేరుగా అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

మొత్తం పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ఎకరం పొలం ఉన్నవారికి నిధులు జమ చేస్తారు ఆ తర్వాత రెండు ఎకరాలు ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ని విడుదల చేస్తుంది.

Rythu Bandhu 2023 Release Date : 26.06.2023

ఇక పొడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పోడు భూముల రైతులకు కూడా రైతుబంధు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

రైతుబంధు కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు సవరణలకు అవకాశం

మరోవైపు రైతు బంధు పథకానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 22 లోపు పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన వారికి కొత్త రిజిస్ట్రేషన్స్ కి పోర్టల్ లో గతంలో అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతం కొత్త వారికి కూడా ఈ అవకాశం ఇచ్చారు.

ఈ మేరకు ఏఈవో ల లాగిన్ లో అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రైతుబంధు లబ్ధిదారులు తమ బ్యాంకు పాస్ పుస్తకం లేదా మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రస్తుతం కల్పించడం జరిగింది.

You cannot copy content of this page