ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2023 24 సంవత్సరం వరకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు GO MS 48 ని ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త అక్రిడిటేషన్ పొందటానికి మార్చి 31 న ప్రభుత్వం జీవో 38 నుంచి జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ లో లబ్ధి పొందాలంటే అక్రిడిటేషన్ పొందినటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ 1250 రూపాయల ప్రీమియం మొత్తాన్ని cfms.ap.gov.in వెబ్సైట్ లో చెల్లించి మార్చ్ 31 2024 వరకు హెల్త్ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చని కమిషనర్ తెలిపారు.

ప్రీమియం మొత్తం చెల్లించినటువంటి జర్నలిస్టులు, ఒరిజినల్ చలానా, రెన్యువల్ చేయించుకున్న రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్‌ కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని రెండవ ఫ్లోర్‌లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, కమిషనర్ కార్యాలయంలో, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా కమిషనర్ తెలిపారు.

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం అంటే ఏంటి

ప్రస్తుతం జర్నలిస్టులుగా ఉన్నటువంటి వారికి మరియు వారి కుటుంబానికి ఈ హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ప్రీమియం అమౌంట్ రూ.2,500 కాగా అందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం వాటా రూ.1,250 ఉంటుంది. భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను నిర్వహిస్తూ జర్నలిస్టులు చేసిన వైద్య ఖర్చులను రీయింబర్స్ చేస్తుంటుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సదరు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్స్ ను పథకం విధివిధానాలను అనుసరించి సెటిల్ చేస్తుంది. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ.2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు పొందవచ్చు, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందించడం జరుగుతుంది.

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు ఉండవు, అదే విధంగా నిర్ధేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు కూడా పొందవచ్చు. ఈ పథకానికి వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ అమలు చేసే ఏజెన్సీగా అదే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page