ఆర్బికే వాలంటీర్ – రైతు మిత్ర సమాచారం

ఆర్బికే వాలంటీర్ – రైతు మిత్ర సమాచారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాలలో సర్వీస్ లు నిరంతరాయంగా అందించేందుకు మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు (VAA) వారు e Crop Booking మరియు ఇతర ఫీల్డ్ పనుల్లో ఉన్నప్పుడు రైతులకు Crop కు సంబందించిన పనులలో సహాయం చేసేందుకు ప్రతి రైతు భరోసా కేంద్రానికి (RBK) కు ఒక వాలంటీర్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. 

  • రైతు భరోసా వాలంటీర్ల క్లస్టర్ కు గాను ఆ సచివాలయ వాలంటీర్ కు Incharge గా MPDO వారు వేయటం జరుగుతుంది.
  • రైతు భరోసాలకు గ్రామ వాలంటీర్లు (రైతు భరోసా వాలంటీర్లు) కొత్తగా జాయిన్ అయినందువలన వారికి ట్రైనింగ్ ఇవ్వవలిసిన అవసరం ఉంది. కావున రాష్ట్రము లోని అన్ని జిల్లాలలో ఒక రోజున ట్రైనింగ్ నిర్వహించి, VAA వారు పనుల్లో ఉన్నప్పుడు పూర్తిగా RBK లను నిర్వహించడం, RBK పనిముట్లను నిర్వహించటం కోసం ట్రైనింగ్ ఇవ్వటం జరుగును.
  • గ్రామ వాలంటీర్లకు రైతు భరోసా వాలంటీర్లు పూర్తిగా విభిన్నం గా ఉంటారు. గ్రామ వాలంటీర్లు నిర్వహించే విధులు RBK వాలంటీర్ నిర్వహించే విధులు వేరుగా ఉంటాయి. కావున గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి RBK వాలంటీర్లకు “రైతు మిత్ర” గా నామకరణం చెయ్యటం జరిగింది.
  • తేదీ 16.02.2023 మరియు 21.02.2023 న జరిగిన వ్యవసాయ సమీక్షా సమావేశం DAO లు అందింన సమాచారం మెరకు రైతు మిత్రలు RBK కు హాజరు అవ్వటం లేదు అని తెలియజేసారు. 
  • ఇక మీదట ఆ రైతు భరోసా గ్రామ వ్యవసాయ సహాయకులు (VAA) లు అందించే Duty / Attendance Certificate ఆధారం గా రైతు మిత్రలకు పారితోషికం అందించటం జరుగును. 

రైతు మిత్రలకు సంబందించిన గత సమాచారం :

  • ప్రతి జిల్లాలో ఇచ్చినటువంటి ఎన్నుకోబడిన గ్రామ వాలంటీర్లను డిప్యూటేషన్ విధానం మీద రైతు భరోసా కేంద్రంలో వారి సేవలు అందించడం జరుగును. డిప్యూటేషన్ గ్రామ వాలంటీర్ RBK లో విధులు నిర్వహహిస్తున్నప్పుడు వారి స్థానంలో సచివాలయం లో వేరొక వాలంటీర్ని ఇంచార్జ్ వేస్తూ వారి విధులు నిర్వహించడం జరుగుతుంది. నెల వారి గౌరవ వేతనం మాత్రం సచివాలయం DDO వారు ఇస్తారు.
  • రైతు భరోసా కేంద్రాలలో సహాయం చేయుటకు ఒక వాలంటీర్ను నియమించే ప్రక్రియలో వారి కనీసం ఇంటర్మీడియట్ లేదా జీవశాస్త్రం [ బయాలజీ ] ఒక సబ్జెక్టుగా కలిగిన విద్యార్హత ఉండాలి. సంబంధిత ఎంపీడీవో వారు పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయ అధికారి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ సూచనల మేరకు వాలంటీర్ను ఎన్నుకుంటారు. 
  • తేదీ ఆగస్టు 5 2022 నాడు జరిగిన రివ్యూ మీటింగ్ నందు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు స్పెషల్ కమిషనర్ వారి అభ్యర్థనను ఆమోదించడం జరిగినది. ఉత్తర్వుల మేరకు గౌరవ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వాలంటీర్ను కేటాయించవలసిందిగా కోరారు.
  • మండల వ్యవసాయ అధికారి, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ వారి రిపోర్టు మేరకు సంబంధిత మండల ఎంపీడీవో వారు వాలంటీర్ ను ఎన్నుకోవలసి ఉంటుంది.
  • వలంటీర్లు ధాన్యం పరీక్ష దశలో పాటు చేబ్రిడ్జ్ మిల్లు గేట్ వద్ద మూడు ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు.
  • A కేటగిరీ ఆర్పీబీకేకు నలుగురు, B కేటగిరీ ఆర్ బీకేలకు ముగ్గురు C కేటగిరి ఆర్బీకేకు ముగ్గురు వలంటీర్లను కేటాయించారు.
  • ఇందుకోసం వీరికి నెలకు రూ.1,500 ప్రోత్సాహం కింద అందించనున్నారు.
  • సిబ్బందికి, టెక్నికల్ సహాయకులు, వలంటీర్లకు త్వరలోనే పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.
  • సేకరణకు ముందే కమిటీలు మిల్లులను తనిఖీ చేస్తారు.
  • ఆర్బీకేలతో మిల్లుల అనుసంధాన ప్రక్రియ ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది.
  • సేకరణ కేంద్రాలు ప్రారంభానికి ముందు మిల్లులు 66 శాతం బ్యాంకు గ్యారెంటీ సమ ర్పించాలి.
  • సేకరణ ప్రక్రియలో అవకతకలను గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదు.

రైతు భరోసా కేంద్ర (RBK) సర్వీసులు :

  1. Stock Receipt Maintenance And Cash Delivery, 
  2. Receiving Indent From The Farmer, 
  3. Sales Through E-pos Machine, 
  4. Stock Delivery, 
  5. Uploading Of Sales In Ifms Portal, 
  6. Maintenance Of Godowns 
  7. Stock Remittance Of Cash Collection To Ap Markfed 
  8. Submission Of Reports తదితరులు.

Downloads :

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page