Ration door delivery – రేషన్ డోర్ డెలివరీ MDU వాహనదారులకు గుడ్ న్యూస్. భీమా అప్డేట్

Ration door delivery – రేషన్ డోర్ డెలివరీ MDU వాహనదారులకు గుడ్ న్యూస్. భీమా అప్డేట్

రేషన్ డోర్ డెలివరీ చేసే MDU వాహనదారులకు గుడ్ న్యూస్. వాహనదారులు చెల్లించే భీమా ప్రీమియం ను ఇకపై ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ నెల 13 నాటికి నిధులు విడుదల.

Ration door delivery vehicles ద్వారా రేషన్ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్న ఎండియు వాహన ఆపరేటర్లు ప్రతి ఏటా చెల్లిస్తున్న బీమా ప్రీమియం మొత్తాన్ని ఇక నుంచి ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటి వరకు వాహన లబ్ధి దారుల నుంచి బీమా ప్రీమియంను ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేస్తున్నాయి. ఏటా 10 వేల రూపాయలు వారి వేతనం నుంచి బీమా కంపెనీలు జమ చేసుకుంటున్నాయి. ఎండియు లబ్ది దారుల వేతనాలను బ్యాంకుల్లో ప్రభుత్వం జమచేస్తుండడంతో అందులో నుంచి బీమా ప్రీమియంను ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేస్తున్నాయి.

అయితే ఇది తమకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఎండియు లబ్దిదారులు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రీమియం నగదును లబ్దిదారుల నుంచి వసూలు చేయవద్దని, ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ మేరకు బ్యాంకులన్నింటికీ సీఎం జగన్ లేఖ రాశారు. ఈ నెల 13న ప్రీమియం నగదును విడుదల చేయాలని సీఎం ఆర్ధిక శాఖను ఆదేశించారు. దీంతో ఎండియు లబ్దిదారులకు భారీ ఊరట కలగనుంది.

రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలిపి 9060 MDU ration వాహనాలు కలిగిన లబ్దిదారులు ఉన్నారు. వీరందరూ కలిపి ప్రతి ఏటా ఒక్కొక్కరు పది వేల రూపాయల వంతున మొత్తం 9.2 కోట్ల రూపాయలు బీమా ప్రీమియం కింద చెల్లిస్తున్నారు. మంత్రి కారుమూరి చొరవతో వీరికి ఈ అమౌంట్ ఆదా అవ్వనుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page