రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి నగదు జమ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 17 లోపు లబ్ధిదారులందరి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదని తెలుస్తోంది. అయితే మీరు కింద ఇవ్వబడిన లింకులో మీ ఆధార్ ద్వారా మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్ పడుతుంది. కాబట్టి వెయిట్ చేయగలరు. మీకు అర్హత ఉండి కూడా ineligible అని ఉంటే ఏం చేయాలో మనం కింద తెలుసుకుందాం.
Click here for Thalliki Vandanam Status
అర్హత ఉన్నా తల్లికి వందనం అమౌంట్ పడలేదా?
మీకు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం అమౌంట్ జమ కానీ పక్షంలో గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ ని సదరు లబ్ధిదారులకు కల్పించడం జరిగింది.
కింద ఇవ్వబడిన ఏదైనా కేటగిరి లో అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకొని సమస్య పరిష్కరించిన తర్వాత 26వ తేదీ లోపు నగదు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

ఇక అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు,ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26తారీకు వరక వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి.
ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పూర్తి అయిన విద్యార్థులకు తల్లికి వందనం వర్తించదు. వారు ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే కోర్సును బట్టి ఫీజు రియంబర్స్మెంట్ (గతంలో విద్యా దీవెన) వర్తిస్తుంది. చదువు ఇంటర్ తో ఆపేస్తే తదుపరి ఎటువంటి పథకం వర్తించదు.
ఇక, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉండి చదువుతున్నట్లయితే అటువంటి వారి జాబితాను ప్రభుత్వం పరిశీలనకు పంపింది. వీరితోపాటు అనాధ శరణాలయాలలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఇంకా అమౌంట్ జమ కాలేదు. ప్రస్తుతం వీరి ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. విద్యాశాఖ అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వారికి నగదు జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
మీ ఖాతాలో తల్లికి వందనం అమౌంట్ జమ అయిందా?
తల్లికి వందనం అమౌంట్ జమ అయిందా?
Leave a Reply