రబీ సాగుకు సంబంధించి రైతుల ఈ-క్రాప్ నమోదు ముగిసింది. ముసాయిదా జాబితాను సోమవారం [10-03-2025] నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నాం అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.
సామాజిక తనిఖీలో భాగంగా ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
అభ్యంతరాలు గ్రామ సభల్లో తెలియజేస్తే.. రైతులు ధ్రువీకరించిన వివరాలతో జాబితాలో మార్పు, చేర్పులు చేస్తామన్నారు.
తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని ఆయన వివరించారు.
Leave a Reply