విద్యార్థులకు గుడ్ న్యూస్….పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

విద్యార్థులకు గుడ్ న్యూస్….పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి నవంబరు 14న ఒక ప్రకటనలో తెలిపారు.

2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.

విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి  https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.

కాలేజిలకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు

2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.*

ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.

విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది.

ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.

Click here to Share

You cannot copy content of this page