శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం పేరు మార్పు

శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం పేరు మార్పు

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన అనేక పథకాల పేర్లను మార్చిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో పథకం పేరును మార్చింది. వైసీపీ హయాంలో తెచ్చిన శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం పేరును ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా మార్చారు. ఈ మేరకు ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీ సర్వే ప్రారంభించారు.

You cannot copy content of this page