సినిమాలకు బ్రేక్ ఇచ్చి! ఆశ్రమంలో ధ్యానం చేస్తూన్న సమంత…..

ప్రముఖ నటి ‘సమంత’ ను ఆమె అభిమానులు ‘సామ్’ అని ముద్దుగా పీల్చుకుంటారు. అయితే ‘సమంత’ తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు . ఆమె ప్రస్తుతం కోయంబత్తూరు లోని “ఈషా ఫౌండేషన్” కు వెళ్లారు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు ‘సద్గురు జగ్గీ వాసుదేవ్’ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ధ్యానం చేశారు….

మెడిటేషన్ కి సంబంధించిన దృశ్యాలు, అక్కడి ప్రకృతి అందాలను, క్యాప్చర్ చేసి సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు….. ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఎటు కదలకుండా కూర్చోవడం అసాధ్యం అనిపించింది…. కానీ ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మార్గమని ఈరోజే అర్థమైంది…అని “సామ్” తన అభిమానులతో తన ఫీలింగ్స్ ను పంచుకున్నారు. ఈ ప్రక్రియ సింపుల్గా, ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని ఊహించలేదు!! అని పేర్కొన్నారు …’సమంత’ షేర్ చేసిన ఫోటోల్లో ఆమె అందరితో కలిసి కూర్చొని సింపుల్ గా కనిపించడంతో తన అభిమానులు ఫిదా అవుతున్నారు…. ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి….

‘సమంత’ కొంతకాలం సినిమాలకు ‘బ్రేక్’ ఇవ్వనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే…. ‘మయోసైటిస్’ తో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం కొన్ని నెలల పాటు విదేశాల్లో ఉంటారంటూ వార్తలు వచ్చాయి.. వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు ఆ హెయిర్ స్టైలిస్ట్ ‘రోహిత్ బట్కర్’ స్పష్టతనిచ్చారు…. ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన “ఖుషి” సినిమా “సెప్టెంబర్ 1″న ప్రేక్షకుల ముందుకు రానుంది.బాలీవుడ్ నటుడు “వరుణ్ ధావన్” తో కలిసి “సిటాడెల్” (citadel )వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page