సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది మూవీ నుండి భారీ అప్డేట్ !!! మెడపై “త్రిశూలం” తో మాస్ జాతర….

మెగా మేనల్లుడి, సుప్రీం హీరో సాయి ” ధరమ్ తేజ్ “తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. మాస్ దర్శకుడు “సంపత్ నంది” దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా మేకర్స్ ఒక మాస్ పోస్టర్ను రిలీజ్ చేశారు. SDT17 అనే తాత్కాలిక టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఫేస్ క్లియర్గా చూపకుండా ఆయన మెడపై త్రిశూలం!!! టాటూ తో చాలా పవర్ ఫుల్ గా, ఎనర్జిటిక్ గా చూపించారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అయితే ‘సాయి ధరమ్ తేజ్ ‘ఇటీవల తన మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో ” సినిమా లో స్క్రీన్ షేర్ చేసిన సంగతి తెలిసిందే… ఇక ఇప్పుడు అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కు సంబంధించిన “ఫస్ట్ లుక్ “విడుదల తేదీ ని ఖరారు చేశారు… ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది… ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ కోసం”పూజా హెగ్డే ” తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం వచ్చింది.

ఈ పోస్టర్ను చూస్తుంటే సంపత్ నంది కూడా తన గత చిత్రాల మాదిరిగా మాస్ మసాలా సినిమాల మాదిరిగా కాకుండా ఏదో కొత్తగా కాన్సెప్ట్ నే సెలెక్ట్ చేసుకున్నారని విషయం తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి “ఫస్ట్ హై” ను అక్టోబర్ 15 ఉదయం 8:55 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు .. ఇక విరూపాక్ష లాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ హిట్ తరువాత బ్రో సినిమాతో మెగా అభిమానులను ఎంతగానో తన నటనతో మెప్పించాడు. ఇక ఇప్పుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ మూవీ నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రివీల్ అవుతుంది అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page