Chadrayan 3 : చంద్రుడిపై దక్షిణ దృవం పై అడుగు మోపిన తొలి దేశంగా భారత్ రికార్డు..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ చేపట్టిన చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ విజయవంతమైంది. సరిగ్గా బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ అడుగుపెట్టింది.

ISRO చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లిపై దిగే సమయం కోసం యావత్తు భారతావనితో పాటు ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న నేపద్యం లో.. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) బుధవారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగింది. సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టగా.. ఇది 20 నిమిషాల పాటు కొనసాగింది..

ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి..

  • నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జులై 14న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది.
  • ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్పీఎం-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు.
  • అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు.
  • ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ‘ల్యాండర్ మాడ్యూల్’ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.

తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్

  • అలా బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్.. ల్యాండింగ్ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) కమాండ్ను పంపించింది.
  • ఈ కమాండ్ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. తన నాలుగు ద్రాటల బ్బుల్ ఇంజిన్లను ప్రజ్వలించి తన వేగాన్ని తగ్గించుకుంది.
  • రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.
  • ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్పీడీసీ), ఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆలీమీటర్లు, లేజర్ డాక్టర్ వెలోసీమీటర్ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది.
  • చివరిగా ల్యాండింగ్కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది.

ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ చరిత్ర…

  • జాబిల్లి దక్షిణ ధ్రువం..! అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని ద్రాక్ష అది. అలాంటి కఠినమైన చోట వ్యోమనౌకను సురక్షితంగా దించి భారత్ సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా అవతరించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!