ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు తగ్గకపోవడంతో ఒంటి పూట బడులను జూన్ 24 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా బోధనా సమయం, రాగి జావ, మరియు మధ్యాహ్న భోజనం సమయాలు

  • ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా
  • పాఠశాల బోధనా సమయం: ఉదయం 7:30 నుండి 11:30 వరకు
  • రాగి జావ: ఉదయం 8:30 నుండి 9:00 వరకు
  • మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగాల సమాచారం కోసం మన Telegram చానల్ లో జాయిన్ అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!