రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం..అయితే జూన్ 17 వరకు ఒంటి పూట బడులు

ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

పాఠశాలలో రేపటి నుంచి యధావిధిగా ప్రారంభం అవుతున్నప్పటికీ జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఎండలు తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినతులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జూన్ 17 వరకు టైమింగ్స్ ఇవే

  • జూన్ 12 నుంచి 17 వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది..
  • ఇక రాగిజావను ఉ. 8.30 నుంచి 9 మధ్యలో అందిస్తారు.
  • ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని 11.30 నుంచి 12 మధ్యలో అమలు చేస్తారు.

ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఉత్తర్వులను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!