YSR Sunna Vaddi Panta Runalu Release Date : రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి వైఎస్సార్ సున్నా వడ్డీ డబ్బులు.. ఎప్పుడంటే..?

YSR Sunna Vaddi Panta Runalu Release Date : రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి వైఎస్సార్ సున్నా వడ్డీ డబ్బులు.. ఎప్పుడంటే..?

Ysr Sunna Vaddi Panta Runalu Release Date : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులను ఈ నెల 28న రైతుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు సంబంధించి రూ.లక్షలోపు బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకుని గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది.

రబీ 2021-22 సీజన్‌కు లబ్ధిదారులును ప్రభుత్వం గుర్తించింqది. వీరి బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 29న రూ.45.22 కోట్లు జమ చేయనుంది. లబ్ధిదారుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. రైతులు వీటిని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కింద ఇవ్వబడిన వెబ్ సైట్‌లోకి వెళ్లి కూడా లబ్ధిదారులు తమ పేరు ఉందో.. లేదో ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లబ్ధిదారుడిగా ఉండి జాబితాలో పేరు లేకపోతే బ్యాంకు అధికారి ధ్రువీకరణ పత్రాన్ని రైతు భరోసా కేంద్రంలో అందించాలి

You cannot copy content of this page