రైతు (పంట) రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు (పంట) రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

పంట రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది.

పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమకానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు.

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు ఇవే

పంట రుణమాఫీ పథకం – 2024 పరిధి, వర్తింపు:-

  • తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2.00 లక్షల (రూపాయలురెండు లక్షలు) వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
  • ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు,జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకుమరియు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకంవర్తిస్తుంది.
  • ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకిఅర్హులు.
  • 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తంపథకానికి అర్హత కలిగి వుంటుంది.
  • రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతకార్డు (పిడిఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది.
  • అట్టి కుటుంబంలో, ఇంటియజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు.

పథకం అమలుకు ఏర్పాట్లు :-

  • వ్యవసాయశాఖ కమిషనర్ మరియు సంచాలకులు (డిఒఎ) పంట రుణమాఫీ 2024పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించబడింది.హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) ఈ పథకానికి ఐటి భాగస్వామిబాధ్యతలు నిర్వహిస్తారు.
  • వ్యవసాయశాఖ సంచాలకులు మరియు ఎన్ఐఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసంఒక ఐటి పోర్టల్ ను నిర్వహిస్తారు.
  • ఈ ఐటి పోర్టల్ లో ప్రతి రైతు కుటుంబానికిసంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్నినిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది.
  • ఈ ఐటి పోర్టల్ లో ఆర్థికశాఖ నిర్వహించేఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించినభాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదులపరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి.
  • ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా(బిఎస్ ఒ) నియమించాలి.
  • ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖసంచాలకులు మరియు ఎస్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
  • బ్యాంక్ నోడల్అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంటరుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి.
  • ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్) నుండి రిఫరెన్స్-1వ మెమోమరియు జత చేసినట్టి ప్రొఫార్మా-1లో డిజిటల్ సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికిసమర్పించాలి.
  • ప్రాథమిక వ్యవసాయ సహకార సోసైటీలు సిబిఎస్ లేవు. కాబట్టి,పి.ఎసిఎస్ కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్-2వ మెమో మరియుజత చేసినట్టి ప్రొఫార్మ-2లో డేటాను డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికిసమర్పించాలి.
  • ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికిసమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలనునివారించడం. అవసరమైతే వ్యవసాయశాఖ సంచాలకులు మరియు ఎన్ఎస్ఐసి డేటావాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి.
  • ఈ పథకం కింద లబ్ధిదారుల మరియు రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులుసమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్ ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తోమరియు పిడిఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డఒక్కో రైతు కుటుంబానికి 09-12-2023 నాటికి బకాయి ఉన్న సంచిత (క్యుములేటివ్)రుణమాఫీ రూ.2.00 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.
  • అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డిబిటి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది. పిఏసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎసిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.
  • ప్రతి రైతు కుటుంబానికి 09-12-2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగాఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమచేయాలి.ప్రతి రైతుకుటుంబానికి 09-12-2023 నాటికి కలిగిఉన్న మొత్తం రుణం కానీ లేకరూ.2.00 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే
  • ఏ కుటుంబానికి అయితే రూ.2.00 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ.2.00 లక్షలకు పైబడివున్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత,అర్హతగల రూ. 2.00 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
  • రూ. 2.00 లక్షల కంటే ఎక్కువ రుణం వున్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్నమహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలోకుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.

మినహాయింపులు :

  • ఈ రుణమాఫీ ఎస్చ్ఐలు, జెఎల్టిలు, ఆర్ఎంజిలు, ఎస్ఇసిఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదు.
  • ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు.
  • కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీపిఎసిఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం- కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్దడేటా లభ్యంగా వున్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది.

బ్యాంకుల యొక్క బాధ్యత :-

  • ప్రతి బ్యాంకు (ప్రొఫార్మా I & II జతచేయనైనది) లో డేటానుబాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి.
  • ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకుసంబంధించిన పంట రుణఖాతా వివరాలు సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరియైనవిధంగా ఇవ్వాలి.
  • పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతిజాబితాపై బ్యాంకు బిఎస్ఓఓ డిజిటల్ సంతకం చేయాలి.
  • నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించిడేటాను సమర్పించిందని భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి.

రైతుల యొక్క బాధ్యతలు :-

  • ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడుసమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లులేదా పంట రుణమాఫీకి అర్హులు కారని కనుగొన్నట్లయితే, పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయశాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది.

ఆడిటు :-

లోన్ అకౌంట్లలో ఉన్న డేటా యధార్ధతను నిర్ధారించేందుకు సహకారశాఖసంచాలకులు మరియు సహకార సంఘాల రిజిష్ట్రార్, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాల ముందస్తు శాంపిల్ ప్రిఆడిట్ ను చేపట్టి, అమలు అధికారికి (వ్యవసాయశాఖసంచాలకులు) వారు కనుగొన్న విషయాలను సమర్పించాలి.

ఈ పథకం క్రింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంకు అకౌంట్ ను ఆర్టిఐ/నాబార్డ్ నిర్ధిష్ట కార్యవిధానం ప్రకారం ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఆడిట్ నుచట్టబద్ధ (స్టాట్యుటరి) ఆడిటర్లు, ప్రత్యేక ఆడిటర్ల ద్వారా చేయించవచ్చును.

పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం:-

  • పథకం గురించి రైతుల సందేహాలకు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి.
  • రైతులు తమ ఇబ్బందులను ఐటి పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయకేంద్రాల వద్ద తెలుపవచ్చు.
  • ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల లోపుపరిష్కరించి, దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉంటుంది.

You cannot copy content of this page