తెలంగాణలో కొత్త పథకం.. రాజీవ్ సివిల్స్ అభయహస్తం..వారికి 1,00,000

తెలంగాణలో కొత్త పథకం.. రాజీవ్ సివిల్స్ అభయహస్తం..వారికి 1,00,000

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. సచివాలయంలో కాసేపటి క్రితం సీఎం రెడ్డి ‘రాజీవ్ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనుంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ది పొందాలనుకునే అభ్యర్థులకు అవసరమైన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను జారీ చేశారు.

లబ్ది పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉండాలి.

వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పని చేసే ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. అలాగే- ఈ పథకం ద్వారా గతంలో ఎలాంటి ప్రయోజనాన్ని కూడా పొందివుండకూడదు. అభ్యర్థులు వారి సివిల్స్ ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు.

దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను రాస్తోన్న వారి సంఖ్య దాదాపు 14 లక్షలుగా ఉంటోంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి 50 వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటోన్నట్లు సింగరేణి క్యాలరీస్ అంచనా వేసింది. సివిల్స్ ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులవుతోన్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటోంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ముఖ్యాంశాలు

  • సివిల్ సర్వీసెస్.. దేశవ్యాప్తంగా ఇది నిరుద్యోగులందరి స్వప్నం.. దీన్ని సాకారం చేసుకోవాలనిలక్షల మంది కలలు గంటారు. వందల మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకుంటారు. మేధోసంపత్తి, క్రమశిక్షణ, అంకితభావం ఎంత ఉన్నప్పటికీ అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్లభించక తమ స్వప్నం దూరమవుతుంటే చూస్తూ మదనపడుతున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు.
  • టాలెంట్ ఉండి.. కఠోర పరిశ్రమ చేసే తత్వం ఉండి కేవలం ఆర్థిక ప్రతిబంధకాలతో సివిల్ సౌధాన్ని అధిగమించలేక మధ్యలోనే తమ ఇష్టమైన రంగాన్ని వదిలి చిన్నపాటి అవకాశాలతో సర్దుకు పోతున్నారు ఎందరో నిరుపేద యువతీ యువకులు.
  • ఇలాంటి నైపుణ్యవంతులైన, ప్రతిభ కలిగిన తెలంగాణ యువత తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని.. అందుకు ప్రతిబంధకంగా ఉంటున్న ఆర్థిక అవరోధాలను తొలగించాలనిరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధనశాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు సంకల్పించారు.
  • ఇందుకోసం దేశానికి వెలుగులు నింపుతున్న తెలంగాణ కొంగుబంగారం సింగరేణి ద్వారాప్రతిభావంతులైన యువతీ యువకుల జీవితాల్లోనూ వెలుగురేఖలు నింపేలా వినూత్నపథకానికి శ్రీకారం చుట్టారు.
  • దేశంలో సివిల్ సర్వీసెస్ లోకి తెలంగాణ యువత ఎక్కువగా చేరేలా ప్రోత్సహించేందుకు,అలాగే వారికి ఎదురయ్యే ఆర్థిక ప్రతిబంధకాలను కొంత మేరకు దూరం చేసేలా సింగరేణిసహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ ప్రాథమిక పరీక్షనువిజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువత అందరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు.
  • తద్వారా వారంతా మెయిన్స్ పరీక్షకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ధీమాగా సన్నద్ధం అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఈ పథకం వల్ల ప్రయోజనం పొంది సివిల్స్ స్థాయికి తెలంగాణ యువత ఎదగడం వల్లదేశాభివృద్ధికే కాకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మరెంతో మంది యువతకుస్పూర్తినిస్తారు. తద్వారా దేశ సుస్థిర భవిష్యత్ కు వారు పాటుపడుతారన్న దృఢ విశ్వాసంతోఈ చరిత్రాత్మక వినూత్న పథకానికి నాంది పలకడం జరిగింది.

ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి ఈ అర్హతలు ఉంటే చాలు

  • సింగరేణి కార్పోరేట్ సామాజిక బాధ్యతలో కార్యక్రమంలో భాగంగా ప్రారంభిస్తున్న ఈ పథకంయొక్క ప్రయోజనం పొందాలంటే కింద పేర్కొన్న అర్హత నిబంధనలు తప్పనిసరిగా ఉండాలి.
  • అభ్యర్థులు జనరల్ (ఈడబ్ల్యుఎస్ కోటా) / బీసీ / ఎస్సీ / ఎస్.టి సామాజికవర్గానికి చెందిన వారై ఉండాలి.
  • అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణుడై ఉండాలి
  • వార్షిక కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగసంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
  • గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు
  • అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సహ పథకం ప్రయోజనాన్నిపొందవచ్చు.

ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అర్హులందరికీలక్ష రూపాయల సాయం

  • దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య దాదాపు 14 లక్షలు అనిఅంచనా
  • ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 50 వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటున్నారని అంచనా
  • తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్యసుమారుగా 400 నుండి 500 వరకు ఉంటుంది
  • ఈ వినూత్న ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హులైన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలవిజేతలు అందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ప్రోత్సాహక నగదు అందించడం జరుగుతుంది.

You cannot copy content of this page