ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ పండుగ కానుకలు

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ పండుగ కానుకలు

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత టీడీపీ హయాంలో ఉన్న పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్య పండగులకు కానుకల కింద రాష్ట్రంలోని రేషన్‌కార్డు లబ్దిదారులకు కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, చంద్రన్న రంజాన్‌ తోఫా పేరిట అందించేవారు. ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఏడాదికి రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది.

చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్‌లో.. కిలో గోధుమ పిండి, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరకిలో కందిపప్పు, అరలీటరు పామాయిల్‌, 100 మిల్లీ గ్రాముల నెయ్యిని కార్డుదారులకు అందించారు. అలాగే క్రిస్మిస్ కానుక కింది వీటినే అందించారు. రంజాన్‌ తోఫా కింద ముస్లింలకు 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 2 కిలోల చక్కెర, 100 మిల్లీగ్రాముల నెయ్యితో తోఫా కిట్లను ఉచితంగా అందజేశారు. 2019 జూన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలిపివేశారు.
ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్‌కార్డు దారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందజేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,48,43,671 రేషన్‌ కార్డులు ఉండగా.. ఇందులో 12 లక్షలకుపైగా ముస్లిం కార్డుదారులు ఉన్నారు. అలాగే ప్రతినెలా రెగ్యులర్‌ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతో చక్కెర, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు, కందిపప్పు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ కిట్‌లను అందజేస్తారు.. పేదలు సంతోషంగా పండగలు జరుపుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు ఆరు నెలలకు పైగా రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. దీని గురించి పూర్తి సమాచారం కింది లింకులో కలదు.

You cannot copy content of this page