వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కీలక ఆదేశాలు – ఆగస్టు 2024

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కీలక ఆదేశాలు – ఆగస్టు 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ పై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు మీకోసం.

వైద్య ఆరోగ్య శాఖ పై సీఎం కీలక నిర్ణయాలు ఇవే

సమీక్ష సమావేశం యొక్క ముఖ్యాంశాలు.

  • ప్రభుత్వ ఆసుపత్రులను అత్యుత్తమ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు.
  • వైద్య ఆరోగ్య శాఖలో బెస్ట్ పాలసీలను అవలంబించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలి.
  • గిరిజన ప్రాంతాల్లో డోలీ మోత లకు ఇక స్వస్తి. ఫీడర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని ఆదేశాలు.
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • అన్ని జిల్లాల్లోనీ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో CT స్కాన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి.
  • ఆసుపత్రుల్లో శిశువుల మిస్సింగ్ ఇకపై ఉండకూడదని ఆదేశించారు.
  • తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్‌లను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో పంపిణీ చేసే ఈ కిట్ల ను తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
  • పాఠశాల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్న టీబీ కేసులపై కూడా సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అధికారులు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఆసుపత్రుల్లో ఉత్తమ విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

You cannot copy content of this page