Rythu Bandhu : నేటి నుంచి 70 లక్షల మందికి రైతుబంధు నిధులు జమ..తొలుత ఎవరికంటే

Rythu Bandhu : నేటి నుంచి 70 లక్షల మందికి రైతుబంధు నిధులు జమ..తొలుత ఎవరికంటే

తెలంగాణలో ఈరోజు నుంచి రైతుబంధు లబ్ధిదారుల ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి అమౌంట్

ఈ ఏడాది 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.

ఏడాది వాన కాలం సీజన్ నాటికి కొత్తగా ఐదు లక్షల మంది కొత్త రైతులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో లక్షన్నర మంది పోడు భూముల రైతులకు కూడా ఈ సీజన్ నుంచి రైతుబంధు వర్తింప చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

జూన్ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయి, పాస్‌బుక్‌ పొందిన వారందరికీ కొత్తగా రైతుబంధు రైతుబంధుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

11వ విడత లో భాగంగా మొత్తం 7,720.29 కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది. గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 300 కోట్లు ప్రభుత్వంపై భారం పడినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

తొలుత సహాయం వీరికే.. కొత్త రైతులకు సూచనలు

రైతుబంధు వానాకాలం సీజన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26 నుంచి జమ చేయనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం తొలుత ఒక ఎకరం ఉన్నవారికి తర్వాత రెండు ఎకరాలు ఆ తర్వాత ఇంకా ఎక్కువ భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నిధులు జమ చేయనున్న విషయం తెలిసిందే.

మొత్తం పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఇక కొత్త రైతులు ఎవరైతే మొదటి సారి రైతుబంధుకు అర్హత సాధించారో వారు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తమ బ్యాంకు వివరాలను అందజేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.

Rythu Bandhu 2023 Release Date : 26.06.2023

తెలంగాణ సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి

Studybizz TS Govt Schemes Updates

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page