ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

ఏపీ లో చేనేత కార్మికుల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేనేత వర్గాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నేతన్నలకు ఆగస్ట్ 7 నుంచి అమలు కానున్న బెనిఫిట్స్ ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా చేనేత పనులు చేసుకుంటూ జీవనాధారం సాధిస్తున్న నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కింద ఇవ్వబడిన ప్రయోజనాలను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 7 అనగా జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వారికి ఈ బెనిఫిట్స్ ని అందిస్తారు. ఏమేం ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.

  • చేనేత వస్త్రాలపై జిఎస్టి మినహాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వారి వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంది.
  • చేనేత కార్మికులకు విద్యుత్ ఫ్రీ.. ఆగస్టు 7 నుంచి చేనేత మగ్గాలపై 200 యూనిట్ల వరకు ఫ్రీ, మర మగ్గాలపై 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
  • కార్మికుల కోసం ఐదు కోట్ల రూపాయలతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఫండ్ ద్వారా అవసరమైనప్పుడు కార్మికులకు తక్కువ వడ్డీ మీద రుణ సౌకర్యం లభించే అవకాశం ఉంటుంది.

చేనేత కార్మికులు మరియు జోలి శాఖపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. వ్యవసాయ శాఖ తర్వాత అత్యధిక కీలకమైనటువంటి రంగం చేనేత రంగం అని, వారిని ఆదుకోవాలని ఉద్దేశంతోనే ఈ ప్రయోజనాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7 గురువారం నుంచి చేనేత కార్మికులకు పైన పేర్కొన్న ప్రయోజనాలు వర్తిస్తాయి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page