AP Ration Update : ఏపీ లో రాబోయే నెలల్లో రేషన్ పై రాగులు, జొన్నలు , గోధుమ పిండి

AP Ration Update : ఏపీ లో రాబోయే నెలల్లో రేషన్ పై రాగులు, జొన్నలు , గోధుమ పిండి

ఏపీ లో ఇక పై రేషన్ మెనూ పెరగనుంది. త్వరలో అందరికి బియ్యం తో పాటు ఇతర ధాన్యాలు కూడా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తం అయ్యాయి.

రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పై రాగులు, జొన్నలు , గోధుమ పిండి ని పంపిణి చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేంద్రం కూడా అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే పైలట్ దశలో [AP Ration Update]..

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాయలసీమ లో రాగులు, జొన్నలు పంపిణి ని పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నారు. దీనికి మంచి స్పందన వస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో గోధుమ పిండి ని కూడా పంపిణి చేస్తున్నారు . 16 రూపాయలకే సబ్సిడీ పై ఈ పంపిణి చేస్తున్నారు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని అదే విధంగా రాష్ట్రానికి లక్ష అంత్యోదయ కార్డులను కూడా కేంద్రం కొత్తగా మంజూరు చేసేందుకు అంగీకరించిందని మంత్రి నాగేశ్వర రావు వెల్లడించారు.

Click here to Share

You cannot copy content of this page