గ్రామ వాలంటీర్స్ కు గుడ్ న్యూస్..ఆ వాలంటీర్ల కు మార్చి 1 నుంచి పెన్షన్

గ్రామ వాలంటీర్స్ కు గుడ్ న్యూస్..ఆ వాలంటీర్ల కు మార్చి 1 నుంచి పెన్షన్

అమరావతి ప్రాంత గ్రామ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు లేని గ్రామ వాలంటీర్స్ కు పెన్షన్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల తో అమరావతిలో భూమి లేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు ఇక పై ప్రతి నెల రూ.2,500 పెన్షన్ అందించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి ఓ ప్రకటన ద్వారా వెల్లడిం చారు.

మార్చి 1 నుండి ఈ పెన్షన్ ను అమరావతి గ్రామ వాలంటీర్లకు వర్తింప చేయనున్నట్లు ఆమె తెలిపారు. అమ‌రావ‌తి లో భూమి లేని నిరుపేద‌ కుటుంబాలకు చెందిన యువతీ యువకులు గ్రామ వాలంటర్లుగా పని చేస్తున్నారు. వీరిని ఉద్యోగులు గా పరిగణించి ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటుంబాలకు పింఛ‌ను రూ.2,500/_ మంజూరు చేయడం జరిగింది.

ఇటీవల పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వై.శ్రీలక్ష్మి అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సాను కూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అమరావతి వాలంటీర్ల కు హామీ ఇచ్చారు.

సత్వరమే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించారు.దీనితో సీఎం వెంటనే స్పందించి వారికి పెన్షన్లు అందించాలని ఆదేశించారు.

అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు మార్చి1వ తేదీ నుండి 2500 పెన్షన్ అందిస్తున్నామని ఈ మేరకు ఆమె తెలిపారు

ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు లేని గ్రామ వాలంటీర్స్ కు పెన్షన్ మంజూరు చేయడం జరిగింది అయితే మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సొంత ఇల్లు లేని గ్రామ వాలంటీర్స్ అందరికీ పెన్షన్ మంజూరు చేస్తారా లేదా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై మరి కొంత సమయం వేచి చూడాలి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page