ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి ‘ పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు. త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు లేదా 15000 చొప్పున ఐదేళ్లలో మొత్తం 75000 ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసింది.
Leave a Reply