అన్నదాత సుఖీభవ 7000 పొందాలంటే థంబ్ అవసరమా?

అన్నదాత సుఖీభవ 7000 పొందాలంటే థంబ్ అవసరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు గుడ్ న్యూస్. జూన్ 20 వ తేదీన అటు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి జమ కానున్నాయి.

పీఎం కిసాన్ కి గతంలో ఈ కేవైసీ ప్రక్రియ ఉండేది. చాలామంది ఇప్పటికే ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరొక ప్రాసెస్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ కింద లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తమ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్లి ekyc అనగా థంబ్ వేయాలని తెలిపింది.

మరి థంబ్ తప్పనిసరిగా వేయాలా?

గతంలో కొంతమంది ఓటీపీ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పొందాలంటే తప్పనిసరిగా తమ సమీప రైతు సేవ కేంద్రానికి వెళ్లి థంబ్ వేయాలని ప్రభుత్వం తెలిపింది.

అయితే కొంతమంది రైతులకు సంబంధించి ఈకేవైసీ డేటా అప్డేట్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ekyc అప్డేట్ అయిందా లేదా అనే విషయం నేరుగా రైతులకు అయితే తెలియదు కాబట్టి రైతులు సమీప రైతుసేవ కేంద్రానికి వెళ్లి తమ ఈ కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవాలి. పూర్తికానిచో, జూన్ 18 లోపు ఈకేవైసీ అనగా థంబ్ వేసి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఇక రైతు సేవ కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి, కాబట్టి రాష్ట్రంలో నలుమూలలలో ఎక్కడ అయినా సరే మీరు మీ సమీప రైతు సేవ కేంద్రానికి వెళ్లి థంబ్ వేసే వీలు ఉంటుంది.

ఈసారి అమౌంట్ ఎంత పడుతుంది?

అన్నదాత సుఖీభవ పథకం కింద ఈసారి విడతలో పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మరియు అన్నదాత సుఖీభవ కింద 5000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ కానుంది.

పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో 2000 రూపాయల చొప్పున మొత్తంగా 6000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తుండగా, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా 14 వేల రూపాయలు మూడు విడతల్లో జమ చేయనుంది.

Annadatha Sukhibava 7000

మొత్తం కలిపి 20 వేల రూపాయలు ప్రతి ఏటా రైతులు ఖాతాలో జమవుతాయి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page