ఫిబ్రవరి నెలాఖరుకి ఉచిత కరెంట్ మరియు 500 కే సిలిండర్ పథకాలు

ఫిబ్రవరి నెలాఖరుకి ఉచిత కరెంట్ మరియు 500 కే సిలిండర్ పథకాలు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజులకు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా దూసుకుపోతోంది.

ఫిబ్రవరి చివరి వారంలో ఉచిత కరెంట్ మరియు 500 సిలిండర్

ఇప్పటికే ఉచిత ప్రయాణం మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా పెంపు వంటివి అమలు చేసిన ప్రభుత్వం , మరో వారం రోజులలో అనగా ఫిబ్రవరి నెలాఖరులోగా 200 యూనిట్ల వరకు ఉన్నవారికి ఉచిత కరెంట్ మరియు ₹500 రూపాయలకే సిలిండర్ వంటి మరో రెండు హామీలను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అధికారం చేపట్టాక తొలిసారి సొంత నియోజక వర్గంలో పర్యటించిన ఆయన, కోస్గి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. నియోజక వర్గంలో ₹4369 కోట్ల తో 20 అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు.

తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారందరికి ఈ రెండు పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.

మార్చ్ 15 న రైతు బంధు, రైతు భరోసా అమలు, రుణ మాఫీ

ఇదే పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. మార్చ్ 15 న కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఎకరా కు ప్రతి ఏటా 15 వేల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది. అదే విధంగా 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసే బాధ్యత కూడా తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

You cannot copy content of this page