ఆరోజే బీసీలకు లక్ష పథకం అమౌంట్ పంపిణి, దరఖాస్తు గడువు ముగిసింది

ఆరోజే బీసీలకు లక్ష పథకం అమౌంట్ పంపిణి, దరఖాస్తు గడువు ముగిసింది

బీసీలకు లక్ష రూపాయల పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 20 గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్టిఫికెట్లు మరియు ఇతర ద్రౌపత్రాలు పొందేందుకు ఆలస్యం అవుతుండడంతో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై మంత్రి గంగుల క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారో కూడా ప్రకటించడం జరిగింది.

గడువు పెంపు ఉండదు : మంత్రి గంగుల

అయితే ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ పథకానికి జూన్ 20 చివరి తేదీగా ఉంటుందని ఈ పథకానికి సంబంధించి గడువును పొడిగించడం లేదని మంత్రి గంగుల ప్రకటించారు.

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి 5.28 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కువగా రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ కులాల నుంచి అప్లికేషన్స్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు లబ్ధిదారుడు వేరే ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని ఇటీవల ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి విధానం కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.

జూలై 15న అమౌంట్ విడుదల

జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాలను పరిశీలించి జులై 5 న కలెక్టర్లు అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందించినట్లు మంత్రి గంగుల తెలిపారు. ఈ విధంగా అర్హత పొందిన వారికి జూలై 15న చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

ఇది చదవండి: తొలి దశలో బీసీలకు లక్ష పథకానికి అర్హత ఉన్న కులాల జాబితా ఇదే

You cannot copy content of this page