Vote From Home : ఇకపై వారికి ఇంటినుంచే ఓట్ వేసే అవకాశం

Vote From Home : ఇకపై వారికి ఇంటినుంచే ఓట్ వేసే అవకాశం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం వెలువడింది.

ఇకపై 80 ఏళ్ల దాటిన వృద్దులకు మరియు దువ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏ విధంగా ఇంటి నుంచి ఓటు వేస్తారు?

ఇంటి నుంచి ఓటు వేసేందుకు నమోదు చేసుకున్న 80 ఏళ్ళు దాటిన వృద్ధులకు మరియు దివ్యాంగులకు స్వయంగా ఎన్నికల కమిషన్ తరపున ఒక బృందం వారి ఇంటికి వెళ్తుంది.

వారి వద్దకు ఫామ్ 12 D పత్రాలను తీసుకువెళ్లి ఓటు నమోదు చేసుకుంటారు.

ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా రికార్డ్ చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే ఎవరికి ఓటు వేశారు అనేది గోప్యంగా నే ఉంచుతామని చెప్పారు.

ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC రాజీవ్ కుమార్ తెలిపారు.


ఈ ఆర్టికల్ పై మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయగలరు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page