దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ను తగ్గించడానికి అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15 నుంచి పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
డిల్లీ ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రధానమంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.[PM Launches PM Viksit Bharat Rojgar Yojana] – లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభం
పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ పథకం అంటే ఏమిటి?
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కొత్తగా ఉద్యోగాలలో జాయిన్ అయ్యే యువకులకు కేంద్ర ప్రభుత్వం తొలి నెలలో 15000 రూపాయలకు పిఎఫ్ కింద అందించనుంది.
తొలిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్వోలో నమోదైనవారికి ఈ పథకం. రూ. 15,000 వరకు ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని రెండు వాయిదాల్లో అందిస్తుంది. రూ. లక్ష వరకు వేతనం పొందే ఉద్యోగులు దీనికి అర్హులు. 6 నెలల సర్వీసు అనంతరం మొదటి వాయిదాను, 12 నెలల ఉద్యోగ కాలం అనంతరం రెండో వాయిదాను చెల్లిస్తారు. పొదుపు అలవాటును పెంపొందించాలనే ఆలోచనతో.. ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు పథకాలు లేదా డిపాజిట్ ఖాతాలో నిర్దేశిత కాలం ఉంచుతారు. వ్యవధి పూర్తయిన తర్వాత ఉద్యోగి వీటిని విత్ డ్రా చేసుకోవచ్చు..


Leave a Reply